Begin typing your search above and press return to search.

'ఓజీ'.. ఆ 15నిమిషాలు పవర్​ ప్యాక్డ్​గా

అయితే ఆ రెండింతో పవన్​.. 15నిమిషాల హై ఓల్టేజ్​ యాక్షన్ ప్యాక్డ్​ ఎంట్రీ సీన్​ను ఓకే చేశారట. ఇది పక్కా అభిమానులకు గూస్​ బంప్స్​ తెప్పిస్తుందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   21 Aug 2023 5:16 AM GMT
ఓజీ.. ఆ 15నిమిషాలు పవర్​ ప్యాక్డ్​గా
X

రీసెంట్​గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. 'హరి హర వీరమల్లు' ఎప్పుడో మొదలు పెట్టగా.. అది ఎప్పుడూ పూర్తి అవుతుందో తెలీదు. హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ దర్శకత్వంలో 'ఓజీ - ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్' త్వరలోనే కొత్త షెడ్యూల్స్​ను ప్రారంభించుకోనున్నాయని తెలిసింది.

అయితే తాజాగా ఓజీ సినిమా గురించి అదిరిపోయే గూస్​బంప్స్​ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ చిత్రం టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ముంబయి బ్యాక్​డ్రాప్​ మాఫియా నేపథ్యంలో కావడం వల్ల అంచనాలు ఇప్పటికే భారీగా పెరిగి పోయాయి. ఈ అంచనాలను మరింతగా పెంచేస్తూ రోజుకో వార్త సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.

రీసెంట్​గానే ఈ చిత్రం కొన్ని షెడ్యూల్స్​ను ముంబయిలో పూర్తి చేసుకుంది. ఈ మూవీలో పవన్ వింటేజ్ లుక్​లో కనిపించనున్నారు. అయితే ఇప్పుడు సినిమాలోని పవన్​ ఇంట్రడక్షన్ సీన్​ గురించి వార్తలు వస్తున్నాయి. సుజీత్ ఈ చిత్రం పవర్ ఫుల్ ఇంట్రోను ప్లాన్ చేశారని తెలిసింది. రెండు పవర్​ఫుల్ ఇంట్రో సీన్స్​ను రాసుకున్నారట. అయితే ఆ రెండింతో పవన్​.. 15నిమిషాల హై ఓల్టేజ్​ యాక్షన్ ప్యాక్డ్​ ఎంట్రీ సీన్​ను ఓకే చేశారట. ఇది పక్కా అభిమానులకు గూస్​ బంప్స్​ తెప్పిస్తుందని అంటున్నారు. అభిమానులు, సీనిప్రియులు షాక్ అయ్యే రేంజ్​లో దీన్ని షూట్​ చేసేందుకు దర్శకుడు సుజీత్​ సన్నాహాలు చేస్తున్నారని ఇన్​సైడ్ టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు పవన్ కెరీర్​లోనే బెస్ట్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్​గా దీన్ని చిత్రీకరించనున్నారని తెలిసింది.

పంజా, గుడుంబా శంకర్​ వంటి సినిమాలు గ్యాంగ్​స్టర్​ నేపథ్యంలోనే వచ్చాయి. ఈ చిత్రాల ఇంట్రో సీన్స్​ను బీట్ చేసేలా సుజీత్ దీని తెరకెక్కిస్తారని అంటున్నారు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అందించబోయే సంగీతం, బ్యాక్​గ్రౌండ్​ స్కోర్​ సినిమాకే హైలైట్​గా నిలవనుందట.

ఇక ఈ చిత్రాన్ని శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్​పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రం కావడంలో సినిమాపై మరింత హైప్ ఉంది. ఇక ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కూడా నటిస్తున్నారు. హీరోయిన్​గా ప్రియాంక మోహన్ నటిస్తోంది. చూడాలి మరి సుజీత్​ పవన్​ను ఎలా చూపిస్తారో, ఏ రేంజ్ ఎలివేషన్ ఇస్తారో.