Begin typing your search above and press return to search.

హిట్‌ రైల్వే స్టేషన్ సీక్వెల్‌ లో మిల్కీ బ్యూటీ..?

ఇప్పుడు ఓదెల రైల్వే స్టేషన్‌ సినిమాకు సీక్వెల్‌ ను తీసుకు వచ్చేందుకు సంపత్ నంది ప్రయత్నాలు చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   23 Jan 2024 12:30 AM GMT
హిట్‌ రైల్వే స్టేషన్ సీక్వెల్‌ లో మిల్కీ బ్యూటీ..?
X

హెబ్బ పటేల్‌, పూజిత పొన్నాడ, సాయి రోనక్‌, నాగ మహేష్ ముఖ్య పాత్రల్లో అశోక్‌ తేజ దర్శకత్వంలో సంపత్ నంది నిర్మించిన 'ఓదెల రైల్వే స్టేషన్‌' సినిమా 2022 లో ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. థియేట్రికల్‌ రిలీజ్‌ ను స్కిప్ చేసి డైరెక్ట్‌ ఓటీటీ ద్వారా వచ్చి ప్రేక్షకులను మెప్పించింది. అంతే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది.

ఇప్పుడు ఓదెల రైల్వే స్టేషన్‌ సినిమాకు సీక్వెల్‌ ను తీసుకు వచ్చేందుకు సంపత్ నంది ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు అశోక్ తేజ కథ ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. మొదటి పార్ట్‌ లోని కొన్ని పాత్రలను తీసుకుని కథను కొనసాగించే విధంగా స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సీక్వెల్‌ కోసం తమన్నా ను సంప్రదిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. సంపత్ నంది మరియు తమన్నా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు కలిసి పలు సందర్భాల్లో వర్క్ చేశారు. కనుక మరోసారి వీరు కలిసి వర్క్ చేయడం లో అతిశయోక్తి లేదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

ఓదెల రైల్వే స్టేషన్‌ లో హెబ్బ పటేల్‌ ను డీ గ్లామర్‌ రోల్‌ లో చూపించిన దర్శకుడు అశోక్‌ తేజ సీక్వెల్‌ లో హీరోయిన్‌ పాత్రను అంతే డీ గ్లామర్‌ గా చూపించే విధంగా కథ ను రాసుకున్నాడా లేదంటే గ్లామర్‌ రోల్‌ లో మోడ్రన్‌ గా హీరోయిన్ ను చూపిస్తాడా అనేది చూడాలి.

సీక్వెల్‌ గా రాబోతున్న ఆ సినిమా అయిన థియేట్రికల్‌ రిలీజ్ అవ్వబోతుందా లేదంటే అది కూడా ఓటీటీ ద్వారానే నేరుగా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అనేది కూడా నిర్మాత సంపత్ నంది నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.