Begin typing your search above and press return to search.

పింక్‌లో మ‌తులు చెడ‌గొడుతున్న స్టార్ కిడ్

బాలీవుడ్ న‌ట‌వార‌సురాళ్ల న‌డుమ ఊహించ‌ని పోటీ నెల‌కొంది. సైలెంట్ గా ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతున్నారు

By:  Tupaki Desk   |   8 Jan 2024 6:13 PM GMT
పింక్‌లో మ‌తులు చెడ‌గొడుతున్న స్టార్ కిడ్
X

బాలీవుడ్ న‌ట‌వార‌సురాళ్ల న‌డుమ ఊహించ‌ని పోటీ నెల‌కొంది. సైలెంట్ గా ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతున్నారు. జాన్వీ, సారా అలీఖాన్, అన‌న్య పాండే లాంటి స్టార్ కిడ్స్ ఒకే సీజ‌న్ లో కెరీర్ ని ప్రారంభించి అటుపై ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతున్నారు. ఆ త‌ర్వాతి జ‌న‌రేష‌న్ లో సుహానా ఖాన్, ఖుషీ క‌పూర్, షాన‌య క‌పూర్ ఒక‌రికొక‌రు పోటీప‌డుతున్నారు.


ఇటీవ‌ల స‌డెన్ గా రేస్ లోకి వ‌చ్చి చేరింది కాజోల్ దేవ‌గ‌న్ వార‌సురాలు నైసా దేవ‌గ‌న్. చాలా కాలంగా డీసెంట్ గాళ్ లా క‌నిపించిన నైసా ఉన్న‌ట్టుండి గ్లామ్ కంటెంట్ ని అమాంతం పెంచేస్తోంది. ఇటీవ‌ల ఓర్రీ అలియాస్ అవ్ర‌త‌మ‌ణితో నైట్ పార్టీల్లో చెల‌రేగిపోయిన నైసా దేవ‌గన్ ఇప్పుడు పింక్ లుక్ లో ఎంతో సాంప్ర‌దాయ బ‌ద్ధంగా క‌నిపించింది. ఈ కొత్త రూపం ఇప్పుడు అభిమానుల్లో గుబులు రేపుతోంది.


మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈ పింక్ లెహంగా లుక్ ని నైసా త‌ల్లి గారైన కాజోల్ స్వ‌యంగా సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసారు. అందంగా కనిపిస్తున్న కుమార్తె నైసా ( 20) విష‌యంలో కాజోల్ ఎంతో మురిసిపోతోంది. దేవ‌గ‌న్ కుటుంబ స‌భ్యులు ఇటీవల ఒక ఫంక్షన్ కోసం సంప్రదాయ దుస్తుల్లో క‌నిపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నైసా ఫోటోలను షేర్ చేస్తూ కాజోల్ ఇలా రాసింది. ''రెండు సంవత్సరాల వయస్సు నుండి 20 సంవత్సరాల వరకు గులాబీ రంగులో అందంగా ఉంది .. ఇప్పటికీ ప్రేమిస్తున్నాను! ధన్యవాదాలు MM (వింక్ ఎమోజి)'' అని రాసింది.


ఈ ఫోటోలు బ‌య‌టికి రాగానే, కాజోల్ అభిమానులంతా నైసాను ప్రశంసించారు. కొందరు ఆమె కాజోల్ లా అంద‌మైన‌ చిరునవ్వును కలిగి ఉంద‌ని పొగిడేశారు. ''ఆమె మీలానే అంద‌మైన‌ చిరునవ్వును కలిగి ఉంది'' అని ఒక అభిమాని రాశాడు. నైసా కూడా తన తల్లిలాగే ఉంది.. చిరునవ్వుతోనే న‌టించేస్తోంది! అని ఒక‌రు వ్యాఖ్యానించారు. ఆ చిరునవ్వు కాజోల్ న‌వ్వులాగా ఉంది! అని మరొకరు వ్యాఖ్యానించారు. నైసా చాలా అందంగా ఉంది...అని ఒక అభిమాని అన్నారు.


ఒక రోజు ముందు మనీష్ మల్హోత్రా స్వ‌యంగా కాజోల్ కి చెందిన కొన్ని ఫోటోల‌ను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసాడు. వీటిలో కాజోల్ బంగారు రంగు చీరలో పూసల హాల్టర్ బ్లౌజ్‌తో క‌నిపించింది. కాజోల్ లుక్ పై అభిమానులు ప్రశంస‌లు కురిపించ‌గా, ఈ లుక్ వెన‌క మ‌నీష్ మ‌ల్హోత్రా ప‌నిత‌నం ఉంద‌ని కితాబిచ్చింది. న్యూ ఇయర్‌ని పురస్కరించుకుని దేవగన్‌లు ఇటీవల వెకేషన్‌కు వెళ్లారు. కాజోల్‌తో పాటు భర్త అజయ్ దేవగన్, పిల్లలు నైసా, యుగ్, అత్తగారు వీణా దేవగన్, కోడలు నీలం దేవగన్ తదితరులు వెకేష‌న్ లో ఉన్నారు. కొన్ని వేకే ఫోటోల‌ను షేర్ చేస్తూ.. కాజోల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసారు. 2024 మొదటి పోస్ట్ .. కృతజ్ఞతా భావాన్ని కొనసాగించే ఆలోచన.. అని రాసారు.

కాజోల్ చివరిగా లస్ట్ స్టోరీస్ 2, ది ట్రయల్ లో కనిపించారు. ఇటీవలే 'దో పట్టి' సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి శశాంక చతుర్వేది దర్శకత్వం వహించారు. కృతి ఈ సినిమాతో సినీనిర్మాత‌గా మారుతోంది.