Begin typing your search above and press return to search.

మహేశ్ బాబుకు పోటీగా ఎన్టీఆర్.. భారీగా రెమ్యునరేషన్

దీని కోసం ఆయన దాదాపు రూ.8 నుంచి రూ.10కోట్లు తీసుకున్నారని ప్రచారం సాగింది. అంతే కాకుండా మరో రెండు బడా బ్రాండ్ ప్రమోషన్స్ కు కూడా సైన్ చేశారట.

By:  Tupaki Desk   |   10 Aug 2023 8:17 AM GMT
మహేశ్ బాబుకు పోటీగా ఎన్టీఆర్.. భారీగా రెమ్యునరేషన్
X

ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు.. కేవలం సినిమాల్లోనే కాదు ఇతర వ్యాపారాలు చేస్తుంటారు. అలానే ఇతర కంపెనీల బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చేస్తుంటారు. అయితే ఈ బ్రాండ్ ప్రమోషన్స్ కోసం టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలున్నా.. ఎక్కువగా టాప్ కంపెనీలన్నీ సూపర్ స్టార్ మహేశ్ బాబు చుట్టూనే తిరుగుతుంటాయి. ఆ తర్వాత అల్లు అర్జున్, ఈ మధ్య విజయ్ దేవరకొండ ఎక్కువగా కనిపిస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే మహేశ్ బాబు ఈ సినిమాల కన్నా.. యాడ్స్, బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారానే ఎక్కువ ఆర్జిస్తారని కూాడా మాటలు వినిపిస్తుంటాయి. భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తారట. అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ కూడా ఈ బ్రాండ్ ప్రమోషన్స్ లో కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నారు. ఆయన ఇప్పుడీ యాడ్స్ కోసం చేసే ఛార్జ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మహేశ్ తీసుకునే పారితోషికానికి దాదాపుగా మ్యాచ్ అయ్యేలా తారక్ కూడా తీసుకుంటున్నారని అంటున్నారు.

తాజాగా తారక్.. గుబురు గడ్డం, కళ్ళజోడు, సూపర్ హెయిర్ స్టైల్ తో వావ్ అనిపించేలా కనిపించి సర్ ప్రైజ్ చేశారు. ఇది ఓ ప్రముఖ యాడ్ షూటింగ్ అని వార్తలు వచ్చాయి. దీని కోసం ఆయన దాదాపు రూ.8 నుంచి రూ.10కోట్లు తీసుకున్నారని ప్రచారం సాగింది. అంతే కాకుండా మరో రెండు బడా బ్రాండ్ ప్రమోషన్స్ కు కూడా సైన్ చేశారట. వీటికి కూడా బాగానే ఛార్జ్ చేశారని సమాచారం అందింది.

అంతకుముందు రీసెంట్ గా లీషియస్ ఫుడ్, యాపీ ఫిజ్, మెక్ డొనాల్డ్స్ వంటి ప్రకటనలతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు తారక్. ఈ ప్రకటనల కోసం ఆ సంస్థలు ఎన్టీఆర్ కు భారీగానే పారితోషికం ఇచ్చాయని వార్తలు వచ్చాయి.

దీని బట్టి ఇప్పుడు ఎన్టీఆర్ కూడా బ్రాండ్ ప్రమోషన్లలో జోరు చూపిస్తున్నారని, మహేశ్ కు పోటీగా ఆయన రేంజ్ కు దగ్గరగా ఛార్జ్ చేస్తూ రెమ్యునరేషన్ అందుకుంటున్నారని బయట మాటలు వినిపిస్తున్నాయి. మొత్తంగా యాడ్స్ రెమ్యునరేషన్ విషయంలో మహేశ్ కు చేరువలో తారక్ ఉన్నారని చెబుతున్నారు.

ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో రానున్న సినిమా ఇది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంతో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.