Begin typing your search above and press return to search.

సముద్రంలో దేవర యాక్షన్.. లోతుగా వెళుతున్న తారక్!

రీసెంట్ గా దేవర కొత్త షెడ్యూల్ ప్రారంభమైందంటూ మూవీటీమ్ అఫీషియల్ ఓ సముద్రపు పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   5 Aug 2023 7:11 AM GMT
సముద్రంలో దేవర యాక్షన్.. లోతుగా వెళుతున్న తారక్!
X

'ఆర్ఆర్ఆర్' లాంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మరో భారీ చిత్రం 'దేవర'. 'ఆర్ఆర్ఆర్' తర్వాత గ్లోబల్ వైడ్ క్రేజ్ రావడంతో.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ముఖ్యంగా 'కొమురం భీముడో' సాంగ్ లో ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి వరల్డ్ వైడ్ ఫ్యాన్స్‌.. దేవర కోసం మరింత ఎక్కువ ఆశిస్తున్నారు. దీంతో తారక్ పై ఒత్తిడి బాగా పెరిగిపోయింది. అందుకే ఆయన కూడా ఈ చిత్రం కోసం బాగా కష్టపడుతున్నారు. ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరీ శ్రమిస్తున్నారు.

రీసెంట్ గా 'దేవర' కొత్త షెడ్యూల్ ప్రారంభమైందంటూ మూవీటీమ్ అఫీషియల్ ఓ సముద్రపు పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీని బట్టి భారీ తుఫాను, సముద్రపు అలల మధ్యలో హై ఓల్జేట్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. ఈ సీక్వెన్స్ లో ఎన్నో స్టంట్ లు, విజవల్ ఎఫెక్ట్ తో షూట్ చేస్తున్నారట.

తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ సీ సీక్వెన్ షూట్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలిసింది. హైదరాబాద్ లోని ఒక స్పెషల్ సెట్ లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారు. ఓ హాలీవుడ్ టీమ్ ఆధ్వర్యంలో రూపొందించే ఈ సీక్వెన్స్ లోని ప్రతి సన్నివేశాన్ని ఎంతో శ్రద్ధగా తెలుసుకుని మరి తారక్ చేస్తున్నారట.

విజవల్ ఎఫెక్ట్ మేకింగ్ విషయంలోనూ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారట. ఏ ఒక్కటి కూడా వదలకుండా ప్రతి చిన్న విషయాన్ని తాను కూడా అర్థం చేసుకుంటూ వీలైతే సలహాలు కూడా ఇస్తూ అన్నింట్లో ఇన్వాల్వ్ అవుతున్నారని తెలిసింది. రీసెంట్ విజవల్ ఎఫెక్ట్ విషయంలో 'ఆదిపురుష్' ఎన్ని విమర్శలు అందుకుందో తెలిసిన విషయమే. అందుకే తారక్ ముందు జాగ్రత్తగా తానే అన్ని దగ్గరుండి మరీ చూసుకుంటున్నారని అంతా అంటున్నారు.

ఇకపోతే కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్.. ప్రకృతి గురించి ఆడియెన్స్ సోషల్ మెసేజ్ ఇస్తూనే మాస్ ఎంటర్‌టైనర్‌గా బాగా ఆకట్టుకుంది. ఈ హిట్ కాంబో మళ్లీ రిపీట్ కాబోతుందని తెలియగానే.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక ఈ చిత్ర క్యాస్టింగ్‌ కూడా ప్రేక్షకుల్లో మరింత అంచనాలను పెంచింది.

ఈ సినిమాతో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్ అరంగేట్రం చేయనుంది. తమిళ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్‌ అందిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. రీసెంట్ గా దసరా లాంటి భారీ కమర్షియల్ చిత్రంతో టాలీవుడ్‌ కు పరిచయమైన షైన్ టామ్ చాకో కూడా ఈ సినిమలోని ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమాను 2024 ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.