ఫాల్కే బయోపిక్ కోసం తారక్-అమీర్ మధ్య పోటీ!
ఫాల్కే పాత్రలో నటించడానికి ఇద్దరు నటులు ఆసక్తి చూపడంతో? సన్నివేశం రసవత్తరంగా మారింది.
By: Tupaki Desk | 16 May 2025 8:00 AMభారతీయ సినీ పితామహుడు దాదాసాహెబ్ బయోపిక్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫాల్కే పాత్రలో నటించడానికి ఇద్దరు నటులు ఆసక్తి చూపడంతో? సన్నివేశం రసవత్తరంగా మారింది. అనూహ్యంగా ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. అంతిమంగా ఫాల్కే పాత్రలో నటించే అవకాశం ఎవరికి దక్కుతుంది? అన్నది తెలియదు గానీ... ఇద్దరు రేసులో ఉండటం మాత్రం అంతకంతకు ఆసక్తికరంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాల్కే పాత్రలో నితిక్ కక్కర్ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. మేడ్ ఇన్ ఇండియా పేరుతో బహు భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నా రుట. రాజమౌళి సమర్ప ణలో కార్తికేయ- వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మించడానికి ముందుకొచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఇదే ప్రాజెక్ట్ గురించి అమీర్ ఖాన్ - రాజ్ కుమార్ హిరాణీలో మధ్య కూడా కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయట.
నాలుగేళ్ల క్రితమే ఈ స్క్రిప్ట్ పనులు హిరాణీ మొదలు పెట్టినట్లు సమాచారం. `సితారే జమీన్` రిలీజ్ కాగానే అమీర్ సిద్దంగ ఉండాలని కూడా హిరానీ ఆదేశించినట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరు గుతోంది. అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలవుతుందని వినిపిస్తుంది. భారతదేశ స్వాతంత్ర పోరాట నేపథ్యం-భారతీయ సినిమాకు పడిన పునాదులు మేళవింపుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఇలా ఒకేసారి ఇద్దరు హీరోలు ఒకే జీవితంలో నటించడానికి ముందుకు రావడం చిత్ర పరిశ్రమలో ఇదే తొలిసారి. హీరోల మధ్య ఎన్నడు ఇలాంటి క్లాష్ తెరపైకి రాలేదు. మహాభారతం విషయంలో అమీర్ ఖాన్-రాజమౌళి మధ్య క్లాష్ వచ్చింది. అయితే `మహా భారతం` చాలా పెద్దది కావడంతో? అది పెద్దగా హైలైట్ కాలేదు. ఎవరికి తగ్గట్టు వారు మహాభారతం తీసుకునే వెసులు బాటు ఉంది కాబట్టి పెద్దగా చర్చకు తెర తీయలేదు. కానీ ఇప్పుడు ఏకంగా బయోపిక్ పాత్ర విషయంలో క్లాష్ తలెత్తడం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.