ఎన్టీఆర్-నీల్ మూవీ కోసం ఈసారి అంతకు మించి..!
కేజీఎఫ్, సలార్ వంటి బిగ్గెస్ట్ యాక్షన్ బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా అనగానే అంచనాలు సహజంగానే భారీగా ఉంటాయి.
By: Tupaki Desk | 15 Jun 2025 1:30 PMకేజీఎఫ్, సలార్ వంటి బిగ్గెస్ట్ యాక్షన్ బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా అనగానే అంచనాలు సహజంగానే భారీగా ఉంటాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రశాంత్ నీల్ భారీ చిత్రాన్ని ప్లాన్ చేశాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న కారణంగా అంచనాలు రెట్టింపు అయ్యాయి. వీరిద్దరి కాంబోలో మూవీ దాదాపు ఐదేళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు వీరి కాంబో మూవీ పట్టాలెక్కింది. సలార్ చిత్రానికి ముందు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ అనే ప్రచారం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మధ్య మంచి సన్నిహిత్యం ఉంది. అందుకే ఈ సినిమాపై ఇంకాస్త అంచనాలు పెరిగాయి.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా అనగానే ఓ భారీ యాక్షన్ సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. కానీ ఈ సినిమాలో యాక్షన్తో పాటు ఎమోషన్స్కి సైతం పెద్ద పీట వేశారని తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్-నీల్ మూవీ ప్రస్తుతం ఒక భారీ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణకు రెడీ అవుతోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ను కర్ణాటకలో చేశారు. అక్కడ ఒక ప్రత్యేక సెట్లో షూటింగ్ చేశారు. ఆ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్లో షూటింగ్ చేశారు. ఇప్పుడు కొత్త షెడ్యూల్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త యాక్షన్ సీన్ను భారీ సెట్లో రూపొందించేందుకు గాను దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశాడని తెలుస్తోంది.
ఇప్పటి వరకు వేసిన సెట్స్తో పోల్చితే ఈ సెట్ అంతకు మించి అన్నట్లుగా భారీగా ఉందని తెలుస్తోంది. సినిమాలో అత్యంత కీలకమైన యాక్షన్ సీన్ ఇది అని, ఇందులో వందలాది మంది ఫైటర్స్ పాల్గొంటున్నారు, అంతే కాకుండా వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులు సైతం ఈ షూటింగ్లో కనిపించబోతున్నారు. వందలాది మంది టెక్నిషియన్స్ పాల్గొనబోతున్న ఈ షెడ్యూల్ అత్యంత భారీ ఖర్చుతో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ సాధారణంగానే యాక్షన్ సన్నివేశాల్లో రెచ్చి పోయి నటిస్తాడు. అలాంటిది ప్రశాంత్ నీల్ కాంబో మూవీ, అది కాకుండా భారీ బడ్జెట్తో రూపొందుతున్న యాక్షన్ సీన్ కనుక సినిమాకే హైలైట్గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.
చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటి వరకు ఈ టైటిల్కి సంబంధించిన అధికారిక ప్రకటన చేయలేదు. కానీ మొదటి నుంచి డ్రాగన్ అనే టైటిల్ ప్రముఖంగా చర్చ జరుగుతోంది. డ్రాగన్ టైటిల్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. అదే టైటిల్ను కొనసాగించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే అన్ని భాషల్లో ఒకే టైటిల్ ఉండాలి అంటే ఆ టైటిల్ సెట్ కాకపోవచ్చు అనే అభిప్రాయం సైతం కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్కి తగ్గట్లుగా ఈ సినిమాకు సంగీత దర్శకుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. సినిమా కు బీజీఎం సైతం ప్రముఖ ఆకర్షణగా నిలువబోతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.