Begin typing your search above and press return to search.

సుహాస్.. ఇలా చేస్తాడునుకోలేదు!

మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సుహాస్ మంచి గుర్తింపును అందుకున్నాడు. మొదటి సినిమా కలర్ ఫోటో క్లిక్కవడంతో నిర్మాతల దృష్టిలో పడ్డాడు.

By:  Tupaki Desk   |   10 April 2024 8:16 AM GMT
సుహాస్.. ఇలా చేస్తాడునుకోలేదు!
X

మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సుహాస్ మంచి గుర్తింపును అందుకున్నాడు. మొదటి సినిమా కలర్ ఫోటో క్లిక్కవడంతో నిర్మాతల దృష్టిలో పడ్డాడు. ఇక తర్వాత వచ్చిన సినిమాలు కూడా వేటిక డిఫరెంట్ గా ఉండడంతో సుహాస్ రేంజ్ మరింత పెరిగింది. ముఖ్యంగా రైటర్ పద్మభూషణ్ అనే సినిమాతో పాటు ఆ తర్వాత వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా కూడా కమర్షియల్ గా మంచి కలెక్షన్స్ అందుకున్నాయి.

ఇక ఈ హీరోకు ఆ తర్వాత వెంట వెంటనే ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే సుహాస్ గ్యాప్ లేకుండా ఒకేసారి ఇప్పుడు ఆరు సినిమాలను లైన్లో పెట్టడం కూడా కొంత హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ ఓవర్ ఫ్లో కెరీర్ కు అంత మంచిది కాదు అనే అభిప్రాయాలు వెలబడుతున్నాయి. కాస్త గ్యాప్ తీసుకొని కొత్త తరహా కథలను ప్రమోట్ చేస్తేనే బాగుంటుంది అని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి.

ఇక ఈ విషయంలో కూడా సుహాస్ ఇదివరకే క్లారిటీ ఇచ్చాడు. ఇది అనుకోకుండా జరిగింది అని కాకపోతే లైన్లో ఉన్న సినిమాలు వేటికవే భిన్నంగా ఉంటాయి అని చెప్పాడు. ఇక మొన్నటి వరకు వచ్చిన మూడు సినిమాల విషయంలో ప్రమోషన్ లో బాగా హడావిడిగా కనిపించిన సుహాస్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఒక సినిమా ప్రమోషన్స్ లో మాత్రం పెద్దగా కనిపించడం లేదు.

శ్రీరంగా నీతులు అనే సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో కంచరపాలెం ఫేమ్ కార్తీకరత్నం బేబీ సినిమాలో నటించిన విరాజ్ అశ్విన్ కూడా కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ వచ్చి కూడా చాలా రోజులైంది. కానీ సినిమా ప్రమోషన్స్ కు సంబంధించిన సౌండ్ అయితే ఎక్కడ వినిపించడం లేదు. సుహాస్ మంచి సక్సెస్ ట్రక్ లో ఉన్నప్పటికీ ఈ సినిమాకు ఎందుకు మునుపటి సినిమాల తరహాలో ప్రమోట్ చేయడం లేదు అనే డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి.

ఇందులో తాను మెయిన్ హీరో కాదు అని కూడా చెప్పినప్పటికీ ఒక సినిమాలో భాగమైనప్పుడు ఎంతో కొంత ప్రమోషన్ చేస్తేనే నిర్మాతలకు కూడా ధైర్యంగా ఉంటుంది. కానీ సుహాస్ మాత్రం తన సినిమా కాదు అన్నట్లుగానే ప్రమోషన్స్ లో సౌండ్ పెంచకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలే పోటీగా ఈవారం కొన్ని సినిమాలు దిగుతున్నాయి. గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాతో పాటు విజయ్ ఆంటోనీ లవ్ గురు బాలీవుడ్ మల్టీ స్టారర్ బడే మియా చోటే మియా కూడా తెలుగులో రాబోతోంది.

అజయ్ దేవగన్ మైదాన్ సినిమా కూడా హడావిడి చేసే ఛాన్స్ ఉంది కానీ సుహాస్ నటించిన శ్రీరంగనీతులుకు సంబంధించి ఎలాంటి బజ్ అయితే లేదు. ప్రీమియర్స్ కూడా ప్రదర్శిస్తున్నారు. ఆ విషయంలో కూడా ఎలాంటి హడావుడి లేకపోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక సుహాస్ ఈ ఏడాది మరో నాలుగు సినిమాలను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరి ఆ సినిమాల ప్రమోషన్స్ ను ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి.