Begin typing your search above and press return to search.

నిత్యా మీనన్.. చాలా గ్యాప్ తరువాత మరో బిగ్ ఛాన్స్

మరోసారి ధనుష్ తో ఈ బ్యూటీ రాయన్ సినిమాలో జత కట్టబోతోంది. తాజాగా చిత్ర యూనిటి దీనిని కన్ఫర్మ్ చేసింది.

By:  Tupaki Desk   |   17 March 2024 5:03 AM GMT
నిత్యా మీనన్.. చాలా గ్యాప్ తరువాత మరో బిగ్ ఛాన్స్
X

సౌత్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని బిల్డ్ చేసుకున్న అందాల భామ నిత్య మీనన్. అలా మొదలైంది సినిమాతో ఈ మల్లు బ్యూటీ టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. చైల్డ్ యాక్టర్ గా మలయాళంలో కెరియర్ స్టార్ట్ చేసిన నిత్యా మీనన్ తరువాత హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. తన పెర్ఫార్మెన్స్ తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగులో మొదటి చిత్రంలోనే తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది. దాంతో పెర్ఫార్మెన్స్ పరంగా నిత్యా మీనన్ తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. అయితే కమర్షియల్ హీరోయిన్ గా కంటే పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలని మాత్రమే ఆమె ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తోంది. ఏ భాషలో అయిన కథలో తన క్యారెక్టర్ కి ప్రాధాన్యత ఉంది అంటేనే మూవీ ఒప్పుకుంటుంది.

అందుకే ఈ అమ్మడు స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలని పెద్దగా అందుకోలేకపోయింది. అయిన కూడా పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలు స్టార్ హీరోల పక్కన చేయాలంటే ముందుగా దర్శక నిర్మాతలు నిత్యా మీనన్ పేరుని పరిశీలిస్తారు. ఈ అమ్మడు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో సినిమాలు చేస్తోంది. మిషన్ మంగళ్ మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

తెలుగులో చివరిగా భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడీగా నిత్యా మీనన్ కనిపించింది. పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే హీరో డామినేషన్ ఉంటుంది. అలాంటి మూవీలో కూడా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రని నిత్యా మీనన్ సొంతం చేసుకుంది. తమిళంలో తిరుచిత్రాంబలమ్ అనే మూవీలో ధనుష్ కి జోడీగా నటించింది. ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

అయితే అంత మంచి పాత్రలు చేసినప్పటికీ కూడా నిత్యా మీనన్ కు అంతకుమించిన రేంజ్ లో అయితే అవకాశాలు రావడం లేదు. అందుకు కారణం ఆమె కమర్షియల్ సినిమాలకు చాలా వరకు దూరంగానే ఉంటుంది. అలాగే మితిమీరిన గ్లామర్ కు అమ్మడు విరుద్ధమే. వీలైనంత వరకు కంటెంట్ ఉన్న క్యారెక్టర్స్ చేయడానికి మొగ్గు చూపుతోంది. ఇక చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ అమ్మడికి మంచి ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది.

మరోసారి ధనుష్ తో ఈ బ్యూటీ రాయన్ సినిమాలో జత కట్టబోతోంది. తాజాగా చిత్ర యూనిటి దీనిని కన్ఫర్మ్ చేసింది. అలాగే తమిళంలో ఓ ఫిమేల్ సెంట్రిక్ మూవీ కూడా నిత్యా మీనన్ చేయబోతోంది. ఇప్పటికే డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు తెలుగులో శ్రీమతి కుమారి వెబ్ సిరీస్ తో సక్సెస్ అందుకుంది. తమిళంలో మాస్టర్ పీస్ అనే వెబ్ సిరీస్ తో కూడా మెప్పించింది. ఓ వైపు సినిమాలు, మరో వైపు వెబ్ సిరీస్ లు చేస్తూ నిత్యా మీనన్ నటిగా ప్రస్తుతం దూసుకుపోతోందని తెలుస్తోంది.