Begin typing your search above and press return to search.

20 ఏళ్ల క్రితం ముచ్చట చెప్పిన నితిన్‌

నితిన్ తాజా ఈవెంట్‌ లో మాట్లాడుతూ... నేను ఈ రోజు హీరోగా మారడంకు ఒక కారణం హీరో రాజశేఖర్‌ గారు. ఆయన నటించిన మగాడు సినిమా తో మా నాన్న డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టారు.

By:  Tupaki Desk   |   5 Dec 2023 6:00 AM GMT
20 ఏళ్ల క్రితం ముచ్చట చెప్పిన నితిన్‌
X

నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్‌ గా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. డిసెంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను తాజాగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు హాజరు అయ్యారు.

చాలా కాలంగా సీనియర్‌ హీరో, యాంగ్రీ యంగ్ మన్‌ రాజశేఖర్‌ సెకండ్‌ ఇన్నింగ్స్ గురించి చర్చ జరుగుతోంది. ఆయన హీరోగా చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. దాంతో ఎట్టకేలకు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సినిమాలు చేసేందుకు రాజశేఖర్‌ సిద్ధం అయ్యి.. ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమా లో కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే.

తాజా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో నితిన్‌ మాట్లాడుతూ తమ సినిమాలో రాజశేఖర్ నటించినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. అంతే కాకుండా తాను సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 20 ఏళ్లు దాటిన తర్వాత ఒక ఆసక్తికర విషయాన్ని కూడా నితిన్‌ తాజా ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది.

నితిన్ తాజా ఈవెంట్‌ లో మాట్లాడుతూ... నేను ఈ రోజు హీరోగా మారడంకు ఒక కారణం హీరో రాజశేఖర్‌ గారు. ఆయన నటించిన మగాడు సినిమా తో మా నాన్న డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టారు. ఆ సినిమా తో మా నాన్న కి బాగా డబ్బులు వచ్చి డిస్ట్రిబ్యూషన్‌ కంటిన్యూ చేశారు. అలా నాకు కూడా సినిమాపై ఆసక్తి పెరిగింది.

ఆ రోజు మా నాన్న రాజశేఖర్‌ గారి సినిమాను డిస్ట్రిబ్యూట్‌ చేయకుంటే ఇప్పుడు నేను ఎక్కడ ఉండేవాడినో అన్నట్లుగా నితిన్ వ్యాఖ్యలు చేశాడు. నితిన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అయిన తర్వాత ఈ విషయం చెప్పడం పై చర్చ జరుగుతోంది. సమయం వచ్చింది కనుక నితిన్‌ ఈ విషయం ఇప్పుడు చెప్పాడు అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.