Begin typing your search above and press return to search.

నెగిటివ్ రివ్యూలపై మరో కొత్త కేసు

తమన్నా హీరోయిన్ గా మాలయాళం హీరో దిలిప్ నటించిన బాంద్రా అనే సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలైంది.

By:  Tupaki Desk   |   17 Nov 2023 4:35 PM GMT
నెగిటివ్ రివ్యూలపై మరో కొత్త కేసు
X

ఇటీవల కాలంలో నెగిటివ్ రివ్యూలకు సంబంధించిన విషయంలో ఓ వర్గం నిర్మాతలు కోర్టు వరకు వెళుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక రీసెంట్ గా తమన్నా నటించిన ఒక సినిమా నెగిటివ్ రివ్యూలపై కూడా నిర్మాత అదే తరహాలో న్యాయ స్థానాన్ని సంప్రధించడం హాట్ టాపిక్ గా మారింది. తమన్నా హీరోయిన్ గా మాలయాళం హీరో దిలిప్ నటించిన బాంద్రా అనే సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలైంది.

అయితే ఈ సినిమాకి మొదటి రోజే నెగిటివ్ టాక్ వచ్చింది. ఇక యూట్యూబర్స్ కూడా పలువురు నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు. దీంతో చిత్ర నిర్మాత ఆగ్రహం వ్యక్తం చేస్తూ అలా నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం వల్లనే తమ సినిమాకు డ్యామేజ్ అయ్యిందని కలెక్షన్లు తగ్గి నష్టపోవాల్సి వచ్చిందని కోర్టును ఆశ్రయించారు.

ఇక తిరువంతపురం కోర్టులో అష్వంత్, షీహాబ్, ఉన్ని వ్లాగ్స్, మహమ్మద్, అర్జున్, షిజోస్ టాక్స్, సాయికృష్ణన్ లపై కేసులు నమోదు చేసి నిందితులుగా పేర్కొన్నారు. వాళ్ళు నడిపే యూట్యూబ్ ఛానల్స్ లో లక్షలాది సబ్స్క్రైబర్లు ఉన్నారని వారు చెప్పిన నెగిటివ్ రివ్యూలు సినిమాపై ప్రభావం చూపాయాని అందుకే చాలా వరకు జనాలు థియేటర్లకు రావడం మానేస్తున్నారని ప్రొడ్యూసర్ కంప్లయింట్ ఇచ్చాడు.

ఇక ఈ కేసు సౌత్ ఇండస్ట్రీలోని నిర్మాతల గ్రూపులలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. అంత తేలికగా ఈ విషయం తేలేది కాదని మరికొందరి వాదన. ఎందుకంటే ఒకసారి సినిమా థియేట్రికల్ గా విడుదలై బయటకు వస్తే పబ్లిక్ ప్రాపర్టీగా మారిపోతుంది.

ఆ తరువాత సినిమా బాగోలేదని చెప్పిన ప్రతీ ఒక్కరిని నిలదీయలేమనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఇక బాంద్రా సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించగా దిలిప్ కూడా డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించారు. అరుణ్ గోపి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు బాగానే అనుకున్నప్పటికి ఆ తరువాత దారుణంగా డ్రాప్ అయ్యాయి.