Begin typing your search above and press return to search.

NC23: పర్ఫెక్ట్ హిట్ కాంబినేషన్..

సాయిపల్లవిని సెలక్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో కన్ఫామ్ చేశారు. ఈ ఫోట్లో నాగ చైతన్య, సాయి పల్లవి, చందూ మొండేటి, నిర్మాత అల్లు అరవింద్ కూడా ఉన్నారు.

By:  Tupaki Desk   |   20 Sep 2023 10:06 AM GMT
NC23: పర్ఫెక్ట్ హిట్ కాంబినేషన్..
X

అక్కినేని హీరో నాగ చైతన్య వరస ప్లాప్ లో సతమతమౌతున్నాడు. వరసగా థాంక్యూ, కస్టడీ రెండు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో,మంచి హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. అందుకోసం డైరెక్టర్ చందు మొండేటితో చేతులు కలిపారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రావడానికి రెడీ అవుతోంది. ఈ మూవీ విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ చేస్తోంది.


ఇది మత్స్యకారుని జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ కోసం చైతూ తన కసరత్తులు మొదలుపెట్టారు. రియాల్టీకి దగ్గరగా ఉండాలని, మత్స్యకారుల జీవితం ఎలా ఉంటుంది..? వారు ఎలా ఉంటారు అని తెలుసుకోవడానికి మత్స్యకారుల గ్రామాలకు నాగచైతన్య, చందూ మొండేటి వెళ్లారు. ఈ మూవీ కోసం చైతూ చాలా కష్టపడుతున్నాడు.


అయితే, ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి చైతూ పక్కన హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా కాలంపాటు సాయి పల్లవి, కీర్తిసురేష్ పేర్లు ఎక్కువగా వినిపించాయి. డీగ్లామర్ లుక్ లోనూ అందంగా కనిపించాలంటే సాయి పల్లవి, కీర్తి సురేష్ ఇద్దరూ బెస్ట్ అని భావించారు. అయితే, తాజాగా వీరిద్దరిలోనే ఒకరిని సెలక్ట్ చేశారు. రీసెంట్ గా ఓ హీరోయిన్ ఫేస్ కనిపించకుండా ఓ వీడియో విడుదల చేశారు.

తాజాగా, ఈ రోజు వీడియోలో ఉన్న హీరోయిన్ రివీల్ చేశారు. సాయిపల్లవిని సెలక్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో కన్ఫామ్ చేశారు. ఈ ఫోట్లో నాగ చైతన్య, సాయి పల్లవి, చందూ మొండేటి, నిర్మాత అల్లు అరవింద్ కూడా ఉన్నారు. చైతూ సరసన పల్లవి అయితే బాగుంటుందని వారు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. గతంలో నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో లవ్ స్టోరీ వచ్చింది. ఈ మూవీ మంచి హిట్ అందుకుంది. మరి, ఈ జోడి ఈ సినిమాతో ఎలా మెప్పిస్తుందో చూడాలి.

మరోవైపు, కార్తికేయ 2 వంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన తర్వాత చందూ మొండేటి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ మూవీ కి బడ్జెట్ కూడా భారీగా పెడుతున్నట్లు తెలుస్తోంది.