Begin typing your search above and press return to search.

10 ఇయ‌ర్స్ ఆఫ్ 9 .. న‌య‌న్-విఘ్నేష్ ల‌వ్!

నయనతార -విఘ్నేష్ శివన్ ప్రేమికుల దినోత్సవాన్ని ఈసారి కూడా ఎప్ప‌టిలానే వైభ‌వంగా జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఒక అరుదైన ఫోటోని కూడా తాజాగా షేర్ చేసారు.

By:  Tupaki Desk   |   15 Feb 2024 4:34 AM GMT
10 ఇయ‌ర్స్ ఆఫ్ 9 .. న‌య‌న్-విఘ్నేష్ ల‌వ్!
X

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార - విఘ్నేష్ శివ‌న్ ప్రేమాయణం ఒక సినిమా క‌థ‌ను త‌ల‌పిస్తుంది. ఆ ఇద్ద‌రూ 'నానుమ్ రౌడీ ధాన్' (2014) షూటింగ్ సమయంలో ఒకరినొకరు మొదటిసారి కలుసుకున్నారు. ఆ త‌ర్వాత ప్రేమాయణం, పెళ్లి అనంత‌రం స‌రోగ‌సీలో క‌వ‌లల‌కు జ‌న్మ‌నివ్వ‌డం ఇవ‌న్నీ ఒక సినిమా రీల్ లా సాగిపోయాయి. ఒక దశాబ్దం తరువాత ఆ ఇద్దరూ తమ సోషల్ మీడియా పేజీలలో ఒకరికొకరు తమ ప్రేమను ప్రకటించారు. తమ మ‌ధ్య‌ ప్రేమను వ్యక్తపరచుకోవడానికి ఫిబ్రవరి 14న‌ వాలెంటైన్స్ డే కంటే మంచి రోజు ఏం ఉంటుంది?

నయనతార -విఘ్నేష్ శివన్ ప్రేమికుల దినోత్సవాన్ని ఈసారి కూడా ఎప్ప‌టిలానే వైభ‌వంగా జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఒక అరుదైన ఫోటోని కూడా తాజాగా షేర్ చేసారు. భార్యాభ‌ర్త‌లు ఇరువురూ వారి కుమారులతో కలిసి ఉన్న‌ ఫోటోలను షేర్ చేయ‌గా అవి వైర‌ల్గా మారాయి. విఘ్నేష్ ఇన్ స్టాలో ఇలా రాశాడు. "10 సంవత్సరాల 9. ప్రేమను విశ్వసించే మీలో ప్రతి ఒక్కరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు. నా తంగంతో ఒక దశాబ్దం. మీరు నా ఉయిర్ నుండి నేను మీ ఉలగం.. ఇప్పుడు ఉయిర్ మరియు ఉలగం మీరు .. నేనుగా మారడం వరకు. ఆశీర్వదించబడ్డాను. మా వృద్ధాప్యంలో రాబోయే జన్మల కోసం చాలా అద్భుత క్షణాలతో చాలా దూరం వచ్చాము. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను..." అని క‌వితాత్మ‌క నోట్ రాసారు.

నయనతార దీనికి అద్భుత‌మైన రిప్లై ఇచ్చారు. "నేను నిన్ను ఎప్పటికి తెలుసుకోగలిగిన దానికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను.. నేను చెప్పగలిగిన దానికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను..అయితే నేను మీకు ప్రతిరోజూ హ్యాపీ వాలెంటైన్స్ డే... నా 10 సంవత్సరాల స్వచ్ఛమైన ప్రేమ ఆశీర్వాదాలను తెలియజేస్తానని ఆశిస్తున్నాను" అని పోస్ట్ చేసింది. న‌య‌న్ తన కవల పిల్లలను కౌగిలించుకున్న ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. ఒక ఫోటోలో నయనతార విఘ్నేష్ శివన్‌తో గులాబీల గుత్తిని పట్టుకుని పోజులిచ్చింది. ఆమె చేతితో రాసిన గ్రీటింగ్ కార్డ్‌ని కలిగి ఉంది. దానిపై 'హ్యాపీ వాలెంటైన్స్ డే మై ల‌వ్ ఎప్పటికీ. ఐ లవ్ యూ టు ది మూన్ అండ్ బ్యాక్" అని రాసి ఉంది.

నయనతార మరియు విఘ్నేష్ శివన్ 2022 జూన్‌లో చెన్నైలో వివాహం చేసుకున్నారు. వారు సరోగసీ ద్వారా కవల అబ్బాయిలను స్వాగతించారు. అక్టోబర్ 2022లో అధికారికంగా ప్రకటించారు. జనవరి 2022లో భారతదేశంలో సరోగసీ చట్టాలు మారినందున ప్రజలు నెటిజన్లు దాని చట్టబద్ధతపై సందేహాన్ని లేవనెత్తారు. అయినప్పటికీ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సరైన విచారణ తర్వాత వారికి క్లీన్ చిట్ ఇచ్చింది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. నయనతార ప్రస్తుతం తన సినిమా టెస్ట్ షూటింగ్‌ను ముగించింది. విఘ్నేష్ శివన్ ఎల్‌ఐసి షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.