Begin typing your search above and press return to search.

నారా రోహిత్.. పాలిటిక్స్ షేక్ అయ్యే ప్లాన్?

జగన్ ఎలివేషన్లతో రానున్న యాత్ర 2కు దీటుగా వస్తున్న ఈ ప్రతినిధి 2 చిత్ర కథలో మరికొన్ని కీలక మార్పులు చేస్తున్నారట.

By:  Tupaki Desk   |   15 Sep 2023 7:16 AM GMT
నారా రోహిత్.. పాలిటిక్స్ షేక్ అయ్యే ప్లాన్?
X

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. తేదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో పరిస్థితులు తారుమరయ్యాయి. ఆయనకు మద్దతుగా పలువురు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతుంటే.. అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే నారా ఫ్యామిలీ హీరో రోహిత్ తన పెద్దనాన్నకు జరిగిన అవమానానికి రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటున్నట్లు ప్రచారం ఒకటి నడుస్తుంది .

అయితే డైరెక్ట్ గా కాదు. తాను చేస్తున్న కొత్త సినిమా ప్రతినిధి 2 ద్వారా. జగన్ ఎలివేషన్లతో రానున్న యాత్ర 2కు దీటుగా వస్తున్న ఈ ప్రతినిధి 2 చిత్ర కథలో మరికొన్ని కీలక మార్పులు చేస్తున్నారట. ఇప్పటికే ఈ చిత్రంలో అధికార ప్రభుత్వ పాలనను ఎండగట్టేలా కథను తీర్చిదిద్దారని అంటున్నారు . ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ తో పరిణామాలు మారడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఇప్పుడు ఈ అంశాన్ని కూడా జోడిస్తూ అధికార పార్టీ చేసే కక్ష్య సాధింపు చర్యలు ప్రస్తావించనున్నట్లు టీడీపీ వర్గాళ్ళ్లో ప్రచారం జరుగుతుంది .

రీసెంట్ గా రోహిత్ తేదేపా కార్యాలయానికి వెళ్లి సంఘీభావం కూడా తెలిపారు. మీడియా ముందుకు నేరుగా రాకపోయినా ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలను నిశితంగా గమనిస్తున్నారట. తమ పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతీ వాటికి గట్టి సమాధానం చెప్పాలనుకుంటున్నారట. అందుకు తగ్గట్టే సినిమా కథను తీర్చిదిద్దుతూ షూటింగ్ చేస్తున్నారట.

ఇకపోతే ప్రతినిధి 2 విషయానికొస్తే.. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. త‌న కెరీర్‌లోనే సూపర్ హిట్ గా నిలిచిన ప్ర‌తినిధి చిత్రానికి సీక్వెల్‌గా ఇది రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఫ‌స్ట్ లుక్, కాన్సెప్ట్ టీజర్ కూడా సినిమాపై ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. అయితే సినిమా షూటింగ్ చాలా బ్యాలెన్స్ ఉంది. కాబట్టి ఈ చిత్ర కథ మార్పులకు చాలా అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఎలాంటి మార్పులతో, ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తారో.

ఈ చిత్ర మొదటి భాగాన్ని ప్రశాంత్ మండవ తెరకెక్కించారు. ఇప్పుడు ప్ర‌తినిధి 2కు మూర్తి దేవగుప్తాపు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కుమార్రాజా బాతులా, ఆంజనేయులు శ్రీతోట, కొండకల్లా రాజేందర్ రెడ్డి కలిసి వానరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ స్వరాలు సమకూరుస్తున్నారు. 2024 జ‌న‌వ‌రి 25న సినిమా రిలీజ్ కానుంది.