Begin typing your search above and press return to search.

50సం.లు హీరోగా ఎవ‌డూ లేడు: NBK

న‌టుడు కం ఎమ్మెల్యే ఎన్బీకే హిందూపురం ప్ర‌జ‌ల్ని ఉద్ధేశించి మాట్లాడుతూ.. ''నేను న‌టించిన నాలుగు సినిమాలు వ‌రుస‌గా హిట్లు కొట్టాయి.

By:  Tupaki Desk   |   5 May 2025 3:58 AM
50సం.లు హీరోగా ఎవ‌డూ లేడు: NBK
X

వేదిక‌ల‌పై అన్ లిమిటెడ్ ఎమోష‌న్స్‌తో వాక్ధాటిని ప్ర‌ద‌ర్శించ‌డంలో ఎన్బీకే త‌ర్వాతే ఎవ‌రైనా! అలాంటి ఒక ఎమోష‌న‌ల్ స్పీచ్ కి సంబంధించిన ఒక త్రోబ్యాక్ వీడియో ఇప్పుడు మ‌రోసారి సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ గా మారుతోంది. ఈ వీడియోలో న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ చేసిన ఒక వ్యాఖ్య అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. న‌టుడు కం ఎమ్మెల్యే ఎన్బీకే హిందూపురం ప్ర‌జ‌ల్ని ఉద్ధేశించి మాట్లాడుతూ.. ''నేను న‌టించిన నాలుగు సినిమాలు వ‌రుస‌గా హిట్లు కొట్టాయి.

ఆ త‌ర్వాత 50 సంవ‌త్స‌రాలుగా హీరోగా ప్ర‌పంచంలోనే ఎవ‌డూ లేడు!'' అని వ్యాఖ్యానించారు. మ‌ధ్య‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులుగా దారి మ‌రలినవారు ఉన్నారు కానీ, యాభై ఏళ్లుగా హీరోగా ఎవ‌ర లేరు. అలా నిల‌బ‌డ‌టానికి నాకు శ‌క్తినిచ్చిన తెలుగు జాతికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకుంటున్నాను... అని బాల‌య్య అన్నారు. కెరీర్‌లో న‌టుడిగా ఎన్నో అద్భుత పాత్ర‌లు చేసాను. నాన్న‌గారు కూడా చేయ‌లేక‌పోయిన‌వి చేసాను. ఆయ‌న‌ 'గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి' సినిమా చేయాల‌నుకున్నారు. నేను చేయ‌గ‌లిగాను.. అని ఎన్బీకే గుర్తు చేసుకున్నారు.

బాల‌కృష్ణ గురించి చాలా మాట్లాడుకుంటారు. ఏం చూసి బాల‌కృష్ణ‌కు ఇంత పొగ‌రు? ఏం చూసి బాల‌య్య‌కు ఇంత ధైర్యం? అని అనుకుంటారు. న‌న్ను నేను చూసుకుని ఇలా ఉంటాను. విప్ల‌వాల బాట‌లో ఉంటాను. న‌న్ను నేను తెలుసుకుని స‌వాల్ గా ఉంటాను. నా మాట .. నా బాట సూటిగా ఉంటాయి. నా తీరు ఘ‌న గాంబీర్య రూపంగా వెలుగుతూ ఉంటుంది! అని అన్నారు. న‌న్ను మీరు సినిమా న‌టుడిగానే కాదు.. చాలా కోణాల్లో చూస్తున్నారు. నాలోని మాన‌వ‌త‌, తెగువ చూస్తున్నారు.. అని అన్నారు.

మ‌ళ్లీ ఎన్నుకున్నారంటే...!

''నీతి నిబ‌ద్ధ‌త నిష్క‌ల్మ‌షం తో అంద‌రూ ఉండాలని ఎన్బీకే అన్నారు. నేను మ‌ళ్లీ హిందూపురం ఎమ్మెల్యేన‌య్యానంటే ప‌నులు చేసాను కాబ‌ట్టే. ఎంద‌రో వ‌చ్చారు రాజ‌కీయాల్లోకి.. నామ‌రూపాల్లేకుండా పోయారు.. అడ్రెస్ లేకుండా పోయారు. హిందూపురంలో ప‌నులు చేసాను గ‌నుకే న‌న్ను ఎన్నుకున్నార''ని నంద‌మూరి బాల‌కృష్ణ అన్నారు. సామాజిక బాధ్య‌త ముఖ్యం. ప్ర‌జ‌లు స‌మాజానికి తిరిగి ఏం ఇచ్చామ‌న్న‌ది ముఖ్యం. ప్ర‌జ‌లు అప్ప‌గించిన ప‌ని చేసిన‌ప్పుడే చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలుస్తామ‌ని అన్నారు.