ఈసారి బాలయ్యతో అంచనాలను మించేలా..
అఖండ2 సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కూడా ఫినిష్ కాబోతుంది.
By: Tupaki Desk | 1 May 2025 2:30 AMఅఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. సక్సెస్ ఇచ్చిన జోష్ లో బాలయ్య వరుస సినిమాలను లైన్ లో పెడుతూ యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు తీస్తూ సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ2 తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.
అఖండ సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. బోయపాటి కూడా ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అఖండ2 ను తెరకెక్కిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
అఖండ2 సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కూడా ఫినిష్ కాబోతుంది. దీంతో బాలయ్య నెక్ట్స్ సినిమా ఎవరితో ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైమ్ లో బాలయ్య తర్వాతి సినిమాపై ఓ అప్డేట్ వచ్చింది. అఖండ2 తర్వాత బాలయ్య సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఉండనున్నట్టు స్వయంగా గోపీచందే తెలిపాడు.
అఖండ2 తర్వాత బాలయ్య బాబు సినిమా తనతోనే ఉంటుందని, ఆల్రెడీ స్క్రిప్ట్ డిస్కషన్స్ కూడా అయ్యాయని, కొత్త డైమన్షన్స్ తో సాలిడ్ కథను రెడీ చేశానని, సినిమా అందరి అంచనాలను మించి ఉంటుందని గోపీచంద్ మలినేని తెలిపాడు. జూన్ 10న బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా సినిమా పూజా కార్యక్రమాలతో లాంచ్ కానుందని, వీర సింహారెడ్డి లుక్ ని మించేలా బాలయ్య లుక్ ను డిజైన్ చేస్తున్నట్టు గోపీచంద్ వెల్లడించాడు.
ఇదిలా ఉంటే గోపీచంద్ మలినేని గతంలో బాలకృష్ణతో వీర సింహారెడ్డి సినిమా చేసి ఆ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత బాలీవుడ్ కు వెళ్లి సన్నీ డియోల్ తో జాట్ మూవీ తీసి మరో హిట్ సాధించిన గోపీచంద్ మలినేని ఇప్పుడు బాలయ్యతో కలిసి మరో సినిమా చేసే ఛాన్స్ అందుకున్నాడు.