Begin typing your search above and press return to search.

50 ఏళ్ళ వయసులో.. ఆ మెరుపేంటీ నమ్రత గారు

ఎన్నో ఫ్యాషన్ ఈవెంట్స్ లలో పాల్గొన్న నమ్రతకు ఆ ప్రపంచంలో ఎనలేని గుర్తింపు అయితే దక్కింది.

By:  Tupaki Desk   |   11 April 2024 10:00 AM GMT
50 ఏళ్ళ వయసులో.. ఆ మెరుపేంటీ నమ్రత గారు
X

మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ ఇప్పుడంటే ఇద్దరు పిల్లల తల్లిగా ఘట్టమనేని ఇంటి కోడలిగా ఫ్యామిలీ బాధ్యతను ఎంతో సక్రమంగా కొనసాగిస్తున్నారు. కానీ ఒకప్పుడు ఆమె మోడల్ గా అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఇటు సౌత్ ఇండస్ట్రీలోనూ ఒక వెలుగు వెలిగారు. చాలా తక్కువ టైం లోనే మోడల్ గా మంచి క్రేజ్ అందుకున్న ఆమె రెండుసార్లు మిస్ ఇండియా ప్రపంచంలో కిరీటాన్ని కూడా సొంతం చేసుకున్నారు.


ఎన్నో ఫ్యాషన్ ఈవెంట్స్ లలో పాల్గొన్న నమ్రతకు ఆ ప్రపంచంలో ఎనలేని గుర్తింపు అయితే దక్కింది. ఇక మహేష్ బాబును పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిస్థాయిలో కుటుంబ బాధ్యతను స్వీకరించిన విషయం తెలిసిందే. నటిగా సినిమాలు చేయకపోయినప్పటికీ నిర్మాతగా కొన్ని డిఫరెంట్ సినిమాలను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక నమ్రత ఫ్యామిలీ విషయంలో ఎంత పద్ధతిగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


తన పిల్లల పెంపకం బాధ్యతను ఎక్కువగా తనే తీసుకుంది. మహేష్ కూడా ఫ్యామిలీ లైఫ్ తో వీలైనంత ఎక్కువ టైమ్ స్పెండ్ చేసే విధంగా ఆమె ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా నమ్రత పోస్ట్ చేసే ఫోటోలు వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇక రీసెంట్ గా ఆమె రంజాన్ పర్వదినాన పోస్ట్ చేసిన ఒక ఫోటో ఎంతగానో అట్రాక్ట్ చేస్తుంది.


పండగకు తగ్గట్టుగా ట్రెడిషినల్ తరహాలోనే ఆమె ప్రత్యేకంగా హైలైట్ అవ్వడం విశేషం. తన డ్రెస్ స్టైల్ తో కూడా ఎప్పటికప్పుడు నమ్రత ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక తన నడవడికతో ఆమె ఒక్కసారిగా తనలోని మోడల్ ను కూడా బయటకు తీసింది అని నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. అంతే కాకుండా ఆమె వయసు 50 దాటినా ఇంకా అదే మెరుపు కనిపిస్తోందని కామెంట్స్ వస్తున్నాయి.

నమ్రత మొదట మహేష్ బాబుతో వంశీ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాతోనే వారిద్దరు ప్రేమలో పడ్డారు. అనంతరం తెలుగులో కేవలం అంజి సినిమాలోనే ఆమె నటించారు. ఇక ఆ తర్వాత కొన్ని ఆఫర్లు వచ్చినప్పటికీ హిందీలో సినిమాలు చేసి పెళ్లి తర్వాత పూర్తిస్థాయిలో నటనకు స్వస్తి చెప్పారు.

భవిష్యత్తులో కూడా తాను నటిగా కనిపించే అవకాశం ఉండదు అని తన నిర్ణయం ప్రకారమే ఒక ఫ్యామిలీ ఉమెన్ లా ఉండడానికి ఇష్టపడుతున్నట్లుగా ఆమె వివరణ ఇచ్చారు. ఇక నిర్మాతగా మాత్రం ప్రయోగాత్మకమైన సినిమాలు నిర్మిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. చివరగా మేజర్ అనే సినిమాను నమ్రత నిర్మించిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ ను అందుకుంది.