Begin typing your search above and press return to search.

బ్యూటీఫుల్ నమ్రత.. మహేష్ సర్ ప్రైజ్ పిక్

టాలీవుడ్‌ లో మోస్ట్ బ్యూటీఫుల్‌ కపుల్స్‌ లో ప్రిన్స్ మహేష్ బాబు- నమ్రతా శిరోద్కర్ జంట ఒకరు

By:  Tupaki Desk   |   22 Jan 2024 6:08 AM GMT
బ్యూటీఫుల్ నమ్రత.. మహేష్ సర్ ప్రైజ్ పిక్
X

టాలీవుడ్‌ లో మోస్ట్ బ్యూటీఫుల్‌ కపుల్స్‌ లో ప్రిన్స్ మహేష్ బాబు- నమ్రతా శిరోద్కర్ జంట ఒకరు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మహేష్ జీవితంలోకి న‌మ్ర‌త ప్ర‌వేశించినప్ప‌టి నుంచి ఆయ‌న జీవితం కొత్త ట‌ర్నింగ్ తీసుకుంద‌ని అంటుంటారు. మహేష్ స్టైల్, లుక్ ఛేంజ్ వెనుక న‌మ్ర‌త కీల‌క వ్య‌క్తిగా చెబుతుంటారు.


కొన్నినెలల క్రితం మహేశ్ కూడా ఈ విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెప్పారు. తన కాస్ట్యూమ్స్ విషయంలో సెలక్షన్ అంతా నమ్రదేనని చెప్పారు. అయితే మహేష్ యాడ్ షూట్స్ లో ఎక్కువగా బిజీ అవ్వడానికి ప్రధాన కారణం కూడా నమ్రతేనని టాక్ వినిపిస్తుంటోంది. నేడు నమ్రత 53వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.

ఈ సందర్భంగా మహేష్ బాబు తన భార్యకు స్పెషల్ విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్‌ డే ఎన్‌ ఎస్‌ జీ అంటూ.. లవ్ సింబల్‌ యాడ్ చేసి ట్వీట్ చేశారు. నా జీవితంలో ప్రతి రోజును అద్భుతంగా తీర్చిదిద్దుతున్న నువ్వు ఈ ఏడాదిలో మరింత ప్రేమ, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది చూసిన అభిమానులు కూడా నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే మహేష్ పోస్ట్ చేసిన పిక్ లో నమ్రత చాలా గ్లామరస్ గా ఉన్నారని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. 52 ఏళ్లు పూర్తైనా బ్యూటీఫుల్ గా ఉన్నారని చెబుతున్నారు. వదినమ్మ హ్యాపీ బర్త్ డే అంటూ ఆ పిక్ ను వైరల్ చేస్తున్నారు. నమ్రత.. ఎప్పటికీ మిస్ ఇండియానే అని అంటున్నారు.

నమ్రత 1993లో మిస్ ఇండియా గా ఎంపికైన విషయం తెలిసిందే. హీరోయిన్ గా ఎన్నో హిందీ, తెలుగు సినిమాల్లో నటించి మెప్పించిన నమ్రత.. మహేష్ ను 2005లో పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. నటనతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న నమ్రత.. పెళ్లి పిల్లల తర్వాత మళ్లీ నటించాలని ఆమె అభిమానులు కోరుకున్నారు. కానీ నమ్రత మాత్రం పూర్తిగా ఫ్యామిలీకి సమయాన్ని కేటాయించారు.

కాగా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన గుంటూరు కారం సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై మిక్స్ డ్ టాక్ సంపాదించింది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందు గుంటూరులో జరిగిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ మహేష్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మీరే నాకు అమ్మా, నాన్న అంటూ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌ స్టాలో నమ్రత పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.