Begin typing your search above and press return to search.

మహేశ్ కు వాళ్ళంటే ఎంతో ఇష్టం.. నేనే లాస్ట్!: నమ్రత

తాజాగా మహేశ్ సతీమణి నమత్రా శిరోద్కర్.. మహేశ్ ఫ్యాన్స్ ను గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. మహేశ్ మాట్లాడిన వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేసి సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చారు.

By:  Tupaki Desk   |   10 Jan 2024 8:05 AM GMT
మహేశ్ కు వాళ్ళంటే ఎంతో ఇష్టం.. నేనే లాస్ట్!: నమ్రత
X

సూపర్ స్టార్ మహేశ్ బాబు.. త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ మహేశ్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఇక నుంచి ఫ్యాన్సే తనకు అమ్మ, నాన్న అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు. దీంతో ఫ్యాన్స్ కూడా ఎప్పుడూ మహేశ్ వెంటే ఉంటామని సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు.

తాజాగా మహేశ్ సతీమణి నమత్రా శిరోద్కర్.. మహేశ్ ఫ్యాన్స్ ను గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. మహేశ్ మాట్లాడిన వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేసి సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన గుంటూరులో ఫ్యాన్స్ చూపించిన ప్రేమ పట్ల తనకు గర్వంగా ఉందని, ఈ ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు నమ్రత.

"మహేశ్ కు అభిమానులంటే ఎంత ఇష్టమే చెప్పిన వారిలో బహుశా నేనే లాస్ట్ వ్యక్తిని కావొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా మహేశ్ పై అనేక మంది ఎప్పటికప్పుడు అపారమైన ప్రేమను కురిపిస్తున్నారు. అన్ని ప్రయత్నాల్లో మద్దతుగా నిలుస్తున్నారు. మరింత కష్టపడి పనిచేసేలా మహేశ్ కు దోహదపడుతున్నారు.

మా సొంతూరు గుంటూరులో ఆయనతోపాటు గుంటూరు కారం మూవీ టీమ్ కు లభించిన ఆదరణ చూస్తుంటే ఓ విషయం గర్వంగా చెప్పగలను. మహేశ్.. మీరు మీ ఫ్యాన్స్ కు ఒక ఎమోషన్. వారు చూపించిన ప్రేమను కుటుంబసభ్యులుగా మనం జీవించి ఉన్నంత కాలం స్వీకరిస్తాం. ఇక మా ప్రేమను.. వివిధ మార్గాల్లో రిటర్న్ గిప్ట్ గా అందిస్తామని చెబుతున్నాను. మీరు కూడా దానిని స్వీకరిస్తారని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఆయనపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు చెప్పడానికి నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. కృతజ్ఞత భావంతో చెబుతున్నా.. నా హార్ట్ నిండిపోయింది" అని నమ్రత పేర్కొన్నారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో మహేశ్ బాబు చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. సంక్రాంతి తనకు, వాళ్ల నాన్నకు బాగా కలిసొచ్చిన పండుగ అని చెప్పారు. ఆ సీజన్ లో విడుదలైన తమ చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయని చెప్పారు. ఇప్పుడు నాన్న లేరని, తన చిత్రాలు చూసి వసూళ్లు గురించి చెబుతుంటే హ్యాపీ గా ఫీలయ్యేవాడని తెలిపారు. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఫ్యాన్సే చెప్పాలని అన్నారు. మహేశ్ గుంటూరు కారం సినిమా.. జనవరి 12వ తేదీన విడుదల కానుంది.