Begin typing your search above and press return to search.

ముఖ్య‌మంత్రిని క‌లిసిన‌ నాగార్జున దంప‌తులు

జూబిలీ హిల్స్‌‌లోని సీఎం నివాసంలో నాగార్జున-అమ‌ల పుష్ప గుచ్చం ఇచ్చి రేవంత్ ని కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలు వీడియో నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   30 Dec 2023 9:51 AM GMT
ముఖ్య‌మంత్రిని క‌లిసిన‌ నాగార్జున దంప‌తులు
X

తెలంగాణ రాష్ట్ర నూత‌న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ ప్ర‌ముఖులు మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీకి సంబంధించిన కొంత మంది పెద్ద‌లు రేవంత్ ని క‌లిసి అభినంద‌న‌లు తెలిపారు. అటుపై మెగాస్టార్ చిరంజీవి వ్య‌క్తిగ‌తంగా సీఎంని క‌లిసారు. స్వ‌యంగా తన ఇంటికి వెళ్లి అభినందించారు. ఈసంద‌ర్భంగా ఇద్ద‌రి మ‌ధ్య సినీ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన ఆస‌క్తిర చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల్ని చిరంజీవి సీఎం దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా నాగార్జున దంప‌తులు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జూబిలీ హిల్స్‌‌లోని సీఎం నివాసంలో నాగార్జున-అమ‌ల పుష్ప గుచ్చం ఇచ్చి రేవంత్ ని కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలు వీడియో నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇలా వ‌రుస‌గా సినీ న‌టులు సీఎంని క‌ల‌వ‌డంతో ఆస‌క్తి సంత‌రిం చుకుంది.

తొలుత‌ రేవంత్‌రెడ్డిని సీఎంగా ప్రకటించిన సమయంలో టాలీవుడ్‌ నుంచి ముందుగా చిరంజీవి అభినందనలు తెలిపిన సంగ‌తి తెలిసిందే. అటుపై సోష‌ల్ మీడియాలో ఇండ‌స్ట్రీకి చెందిన చాలామంది ప్ర‌ముఖులు రేవంత్ విజ‌యంపై శుభాకాంక్ష‌లు తెలియ‌జేసారు. గ‌తంలో కేసీఆర్ అధికారంలో ఉన్న స‌మ‌యంలోనే సినీ పెద్ద‌లు ఆయ‌న్ని ఎప్ప‌టిక‌ప్పుడు క‌లిసేవారు. ఇండ‌స్ట్రీకి సంబంధించిన స‌మ‌స్య‌లు ఆయ‌న దృష్టికి తీసుకెళ్ల‌డం జ‌రిగింది.

వాటిలో కొన్నింటిని ప‌రిష్క‌రించిన‌ట్లు పెద్ద‌లు తెలిపిన సంద‌ర్భాలున్నాయి. తాజాగా రేవంత్ రెడ్డి అధికారంలోకి రావ‌డంతో ఆయ‌న‌తోనూ చాలా అవ‌స‌రాలు..ప‌నులు ముడి ప‌డి ఉన్న నేప‌థ్యంలో ఒక్కొక్క‌రుగా క‌లుస్తున్నారు. ఇండ‌స్ట్రీకి వైపు త‌మ ప్ర‌భుత్వం సానుకూలంగా ఉంటుంద‌ని ఆయ‌న మంత్రి వ‌ర్గం ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.