Begin typing your search above and press return to search.

ఏయూలో నాగార్జున‌-అఖిల్ హల్చ‌ల్!

ఆంధ్రాయూనివ‌ర్శిటీలో కింగ్ నాగార్జున‌-అఖిల్ నిన్న‌టి రోజున‌ హ‌ల్చ‌ల్ చేసారు. తండ్రికొడుకులిద్ద‌రు ఒకేసారి యూనివ‌ర్శి టీలో ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డంతో అభిమానులంతా కేరింత‌లు కొట్టారు.

By:  Tupaki Desk   |   25 Nov 2023 8:26 AM GMT
ఏయూలో నాగార్జున‌-అఖిల్ హల్చ‌ల్!
X

ఆంధ్రాయూనివ‌ర్శిటీలో కింగ్ నాగార్జున‌-అఖిల్ నిన్న‌టి రోజున‌ హ‌ల్చ‌ల్ చేసారు. తండ్రికొడుకులిద్ద‌రు ఒకేసారి యూనివ‌ర్శి టీలో ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డంతో అభిమానులంతా కేరింత‌లు కొట్టారు. స‌డెన్ గా ఇలా వ‌చ్చారేంటి? అని అంతా షాక్ అయ్యారు. ఇద్ద‌రు ఇలా క‌నిపించేస‌రికి జంట‌గా సినిమా ఏదైనా చేస్తున్నారా? అన్న సందేహం క‌లిగింది. ఆ కాసేప‌టికే ఆస‌లు సంగ‌తి అర్ధ‌మైంది. వివ‌రాల్లోకి వెళ్తే..


ఏయూ ప్రాంగణం పాత‌బ‌డ‌టంతో ఇటీవ‌లే దాతల సాయంతో పునర్మిర్మాణం చేశారు. దానిని నాగార్జున చేతుల మీదుగా ప్రారంభించారు. ఆయ‌న‌తో పాటు అఖిల్...ఏఎన్నార్ కుమార్తె నాగ‌సుశీల కూడా ఉన్నారు. నాగార్జున చేతుల మీదుగా లాంచ్ అవ్వ‌డానికి ఓ ప్ర‌త్యేక కార‌ణం ఉంది. ఆంధ్ర విశ్వవి ద్యాల యంలో కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించిన కళా ప్రాంగణంపై తొలి నాటకాన్ని నాటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు ప్రదర్శించారు.

అలా ఏఎన్నార్ కి యూనివ‌ర్శిటీతో తొలి అనుబంధం ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత చాలా కాలం పాటు ఆ వేదిక‌పై క‌ళాకారులు ప్ర‌తిభ‌ని చాటారు అయితే కాల‌క్ర‌మంలో అది పాత బ‌డిపోయింది. ఇటీవ‌లే మ‌రామ‌త్తులు చేసి మ‌ళ్లీ తీర్చి దిద్దారు. ఈసంద‌ర్భంగా నాగార్జున ఫ్యామిలీని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించి ఆయ‌న చేతుల మీదుగా లాంచ్ చేసారు.

అనంత‌రం నాగార్జున మాట్లాడుతూ `ఎంతో చరిత్ర కలిగిన ప్రాంగణాన్ని తిరిగి ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఈ వేదిక నుంచి భవిష్యత్తులో ఎంతోమంది కళాకారులు పరిచయమ‌వ్వాలి. ఇక్కడి వారి మాటలు వింటుంటే అల్లూరి సీతారామరాజు గుర్తుకు వ‌స్తుంటారు. వైజాగ్ ఎంతో అంద‌మైన సిటీ.నాకు బాగా న‌చ్చిన ప్ర‌దేశాల్లో వైజాగ్ ఒక‌టి. ఇక‌పై క‌ళా ప్రాంగ‌ణంలో కూడా షూటింగ్ లు ఎక్కువ‌గా చేస్తామ‌`న్నారు. అలాగే ప‌లువురు వక్త‌లు ఏయూకు రూ.25 వేలు విరాళాన్ని నాడు అక్కినేని నాగేశ్వరరావు అందించారని గుర్తుచేశారు.