Begin typing your search above and press return to search.

గాండీవదారి.. నాగబాబు జస్ట్ మిస్!

ఈ సినిమాతో నాగబాబుకి మరో ఆరెంజ్ లాంటి డిజాస్టర్ పడేదనే మాట వినిపిస్తోంది. దీనికి కారణం నాగబాబు కూడా ప్రారంభంలో ఈ చిత్రానికి ఒక ప్రొడ్యూసర్ గా ఉన్నారంట.

By:  Tupaki Desk   |   27 Aug 2023 4:44 AM GMT
గాండీవదారి.. నాగబాబు జస్ట్ మిస్!
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చివరిగా నటించిన గని మూవీ ఏ స్థాయిలో డిజాస్టర్ అయ్యిందో అందరికి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన ఆ మూవీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అయితే అంతకు మించి అనే విధంగా తాజాగా రిలీజ్ అయిన గాండీవదారి అర్జున మూవీ ఉండటం విశేషం. ఈ చిత్రం ఏకంగా 50 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.

నిజానికి వరుణ్ తేజ్ కి అంత మార్కెట్ కూడా ఇంకా క్రియేట్ కాలేదు. కానీ కంటెంట్ డిమాండ్ చేస్తూ ఉండటంతో భారీ బడ్జెట్ తో యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ చిత్రాన్ని ప్రవీణ్ సత్తారు సిల్వర్ స్క్రీన్ పై ఆవిషకరించారు.

బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకి వరుణ్ తేజ్ కెరియర్ లో అతి తక్కువ ఓపెనింగ్ కలెక్షన్స్ రావడం విశేషం. గని చిత్రం కంటే తక్కువ ఓపెనింగ్ ఈ చిత్రానికి వచ్చాయంట.

దీనిని బట్టి సినిమాకి ఎలాంటి ఆదరణ వచ్చిందనేది అంచనా వేయవచ్చు.కొత్తదనం లేని స్టోరీలైన్ తీసుకొని భారీ యాక్షన్ ఎలిమెంట్స్ జోడించి ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో మూవీ మొత్తం తెరకెక్కించారు. అయితే రిలీజ్ కి ముందు ఆశించిన స్థాయిలో సినిమాకి హైప్ క్రియేట్ కాలేదు. ఒక్క ఇంటర్వ్యూలు తప్ప చెప్పుకోదగ్గ ప్రమోషన్స్ అయితే మూవీక చేయలేదు .

దీంతో జనంలోకి పెద్దగా వెళ్ళలేదు. ఆ ప్రభావం ఓపెనింగ్స్ మీద గట్టిగానే పడింది. ఈ సినిమాతో నాగబాబుకి మరో ఆరెంజ్ లాంటి డిజాస్టర్ పడేదనే మాట వినిపిస్తోంది. దీనికి కారణం నాగబాబు కూడా ప్రారంభంలో ఈ చిత్రానికి ఒక ప్రొడ్యూసర్ గా ఉన్నారంట. అయితే తరువాత ఏమైందో నాగబాబు తప్పుకోవడం, పూర్తి నిర్మాణ బాధ్యతలు బివిఎస్ఎన్ ప్రసాద్ చేతిలోకి వెళ్లిపోయాయి.

దీంతో ఆరెంజ్ లాంటి మరో డిజాస్టర్ ని నాగబాబు తప్పించుకున్నారు. ఆ చిత్రం దెబ్బ నుంచి కోలుకోవడానికి నాగబాబుకి చాలా ఏళ్ళు పట్టింది. అయితే ఆ ఎఫెక్ట్ బివిఎస్ఎన్ ప్రసాద్ పై పడింది. ఇప్పుడు ఈ మెగా ఫ్యామిలీ ఫేవరేట్ ప్రొడ్యూసర్ కి మెగా ప్రిన్స్ తో కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గాండీవదారి అర్జున వచ్చింది. ది ఘోస్ట్ మూవీ తర్వాత అంతకు మించిన డిజాస్టర్ చిత్రాన్ని ప్రవీణ్ సత్తారు వరుణ్ తేజ్ అందించారనే మాట టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది.