Begin typing your search above and press return to search.

జాతీయ అవార్డు విజేత‌ల‌కు మైత్రి గ్రాండ్ పార్టీ

అందుకే ఇప్పుడు ఈ సంబ‌రాన్ని ఎంతో వైభ‌వంగా సెల‌బ్రేట్ చేయాల‌నేది మైత్రి ప్లాన్. అనుకున్న‌దే త‌డ‌వుగా @MythriOfficial TFI జాతీయ అవార్డు విజేతల కోసం ప్ర‌త్యేక సెల‌బ్రేష‌న్ ని ఘ‌నంగా జ‌రుపుతోంది.

By:  Tupaki Desk   |   22 Oct 2023 1:08 AM GMT
జాతీయ అవార్డు విజేత‌ల‌కు మైత్రి గ్రాండ్ పార్టీ
X

టాలీవుడ్ ఆస్కార్ కొల్ల‌గొట్టింది. గోల్డెన్ గ్లోబ్ కైవ‌శం చేసుకుంది. హాలీవుడ్ క్రిటిక్స్ పుర‌స్కారాలు ద‌క్కాయి. ఆ త‌ర్వాత జాతీయ అవార్డుల‌ను గెలుచుకొచ్చింది. అందుకే ఇది చాలా ప్ర‌త్యేక‌మైన సంద‌ర్భం. మ‌న ప్ర‌తిభ విశ్వ‌విఖ్యాతం అవుతోంది. నెమ్మ‌దిగా ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌ను వెన‌క్కి నెట్టి భార‌తీయ సినిమాకు ప్ర‌త్యేక గుర్తింపును తెస్తున్న ప‌రిశ్ర‌మ‌గా టాలీవుడ్ ప్ర‌త్యేక శోభ‌ను సంత‌రించుకుంది. తెలుగు సినీప‌రిశ్ర‌మ‌ శిఖ‌రం ఎత్తుకు ఎదిగింది. ఇంకా ఇంకా ఈ ఎదుగుద‌ల‌ను చూడాల‌ని ప్ర‌జ‌లు ఆరాట‌ప‌డుతున్నారు.

ఇక టాలీవుడ్ ఎదుగుద‌ల‌తో పాటు మైత్రి మూవీ మేక‌ర్స్ ఎదుగుద‌ల గురించి ప్ర‌త్యేకించి ప్ర‌స్థావించాలి. అమెరికాలో పంపిణీదారులుగా ఉన్న మైత్రి మూవీ మేక‌ర్స్ అధినేత‌లు న‌వీన్ ఎర్నేని, వై ర‌విశంక‌ర్, సివి మోహ‌న్ టాలీవుడ్ సినీనిర్మాత‌లుగా అడుగుపెట్టి ఇప్ప‌టికే ఈ ఎనిమిదేళ్ల‌లో అజేయ‌మైన విజ‌యాల‌తో దూసుకెళ్లారు. సీవీ మోహ‌న్ ఇప్పుడు క‌లిసి లేక‌పోయినా మ‌రో ఇద్ద‌రు సంస్థ‌ను విజ‌య‌వంతంగా ర‌న్ చేస్తున్నారు. ఈ సంస్థ అగ్ర హీరోలంద‌రితో సినిమాల్ని తెర‌కెక్కిస్తూ న‌వ‌త‌రం ట్యాలెంటును ఎంక‌రేజ్ చేస్తోంది. ఇటీవ‌ల 'పుష్ప' చిత్రంతో జాతీయ అవార్డుల‌ను న‌ట్టింటికి తెచ్చిన సంస్థ‌గా మైత్రి మూవీ మేక‌ర్స్ కి ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కింది. పుష్ప టైటిల్ పాత్ర‌లో అల్లు అర్జున్ న‌ట‌న‌కు ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డ్ ద‌క్కింది. పుష్ప సంగీతానికి జాతీయ అవార్డ్ ద‌క్కింది. అలాగే మైత్రి సంస్థ నిర్మించిన ఉప్పెన‌కు జాతీయ అవార్డ్ ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. 90ఏళ్ల టాలీవుడ్ చరిత్ర‌లో ఇది అరుదైన ఫీట్. ఇక పుష్ప చిత్రంతో పాటు ఆర్.ఆర్.ఆర్ ప‌లు జాతీయ అవార్డుల‌ను ద‌క్కించుకుంది.

టాలీవుడ్ ట్యాలెంట్ కి జాతీయ అవార్డులు ద‌క్క‌డం అన్నది అరుదైన ఘ‌న‌త‌. ఇవి అంద‌రికీ అంద‌నివి. అందుకే ఇప్పుడు ఈ సంబ‌రాన్ని ఎంతో వైభ‌వంగా సెల‌బ్రేట్ చేయాల‌నేది మైత్రి ప్లాన్. అనుకున్న‌దే త‌డ‌వుగా @MythriOfficial TFI జాతీయ అవార్డు విజేతల కోసం ప్ర‌త్యేక సెల‌బ్రేష‌న్ ని ఘ‌నంగా జ‌రుపుతోంది. సెల‌బ్రేష‌న్ వేళ ఆకాశం ప్ర‌కాశ‌వంతం అయ్యేలా అద్భుత‌మైన లైట్నింగ్ కాంతి వెలువ‌డింది. వెన్యూ వ‌ద్ద ద్విగుణీకృత‌మైన కాంతుల్లో భారీ సెట్లు ఆక‌ట్టుకుంటున్నాయి. స్టార్లంతా ఈ వేదిక‌కు విచ్చేయ‌గా వేడుక సంబ‌రంగా సాగుతోంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు అంత‌ర్జాలంలోకి వ‌చ్చాయి. వైర‌ల్ గా మారుతున్నాయి. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి, ఆర్.ఆర్.ఆర్ టీమ్.. పుష్ప టీమ్ ఈ వేడుక‌లో ప్ర‌త్యేకంగా మెర‌వ‌నున్నాయి. తెలుగు సినిమా గర్వించదగ్గ గొప్ప వేడుకకు సంబంధించిన మ‌రిన్ని అప్ డేట్స్ కోసం వెయిట్ అండ్ సీ..