Begin typing your search above and press return to search.

తిరుపతిలో 2కి.మీ ట్రాఫిక్ జామ్‌.. స్టార్ హీరోపై ఫైర్‌

తిరుపతి అలిపిరి ప్రాంతంలో డి 51 షూటింగ్ జరుగుతుండగా రోడ్డుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   31 Jan 2024 4:10 PM GMT
తిరుపతిలో 2కి.మీ ట్రాఫిక్ జామ్‌.. స్టార్ హీరోపై ఫైర్‌
X

ధనుష్ ప్ర‌ధాన పాత్ర‌లో నాగార్జున అతిథిగా శేఖర్ కమ్ముల తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం వినోద పరిశ్రమలో స‌ర్వ‌త్రా ఆస‌క్తిని క‌లిగిస్తోంది. అయితే ఆరంభం ఈ సినిమా షూట్ లో చిన్న‌పాటి ఆటంకం. ఈ సినిమా షూటింగ్ ఇటీవల తిరుపతిలో ప్రారంభం కావడంతో అలిపిరిలో ట్రాఫిక్ జామ్ అయింది. ధనుష్‌ని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు గుమిగూడ‌టంతో ఇరుకైన హరే రామ హరే కృష్ణ రహదారిపై జనవరి 30 మంగళవారం ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్‌కు సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. షూటింగ్‌ను నిలిపివేయాలని బిజెపి పిటిషన్ దాఖలు చేయడంతో, తిరుపతి మున్సిపల్ పోలీసులు షూటింగ్ అనుమతిని రద్దు చేసి డి 51 (ధ‌నుష్ కెరీర్ 51వ చిత్రం) చిత్రీకరణను నిలిపివేశారు. తిరుపతి అలిపిరి ప్రాంతంలో డి 51 షూటింగ్ జరుగుతుండగా రోడ్డుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరుపతికి వెళ్లే భక్తులకు ఆ ప్రాంతం దాటే క్రమంలో తీవ్ర‌ ఇబ్బందులు ఎదురయ్యాయి. మంగళవారం ఉదయం చిత్రీకరణ ప్రారంభం కాగా, ఒక వైపు, యాత్రికులు తిరుమలకు వెళుతూ అక్క‌డ గుమిగూడారు. షూటింగ్ జరుగుతుండగా తీవ్ర‌మైన‌ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో స్థానికులు, భక్తులు ఇబ్బంది పడ్డారు. ఉదయం కొద్దిసేపు చిత్రీకరణతో ఈ రుబాబ్ ఎదురైంది. తిరుమల కొండకు వెళ్లే యాత్రికులు కారులో తిరుమల కొండకు వెళ్లాలంటే అలిపిరి దాటాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రద్దీ పెరగడంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో కొందరు స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రద్దీగా ఉండే రహదారిపై సినిమా షూటింగ్ ఇప్పుడు స్థానిక ప్రజల్లో చర్చకు దారితీసింది. డి 51 మేకర్స్ ముందుగానే షూట్ చేయడానికి అనుమతి పొందినప్పటికీ తిరుపతి మున్సిపల్ పోలీసులు షూటింగ్‌ను నిలిపివేశారు.

డి51 సినిమాలో కింగ్ నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది. ఇది ధనుష్ కి తెలుగు అరంగేట్ర చిత్రం. ధ‌నుష్ చివరిగా కెప్టెన్ మిల్లర్ చిత్రంలో కనిపించాడు. దీనికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. ధనుష్ స్వీయ‌ దర్శకత్వంలో D50 కూడా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ చిత్రంలో ఎస్‌జె సూర్య, ధనుష్, నిత్యా మీనన్, సందీప్ కిషన్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.