Begin typing your search above and press return to search.

మెగా హీరోతో ఒరేయ్‌ అనేంత స్నేహం ఆమెకి ఉందా?

నవీన్ చంద్ర, స్వాతి ముఖ్య పాత్రలో నటించిన 'మంత్ ఆఫ్ మధు' చిత్రం అక్టోబర్ ఆరో తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   27 Sep 2023 6:53 AM GMT
మెగా హీరోతో ఒరేయ్‌ అనేంత స్నేహం ఆమెకి ఉందా?
X

నవీన్ చంద్ర, స్వాతి ముఖ్య పాత్రలో నటించిన 'మంత్ ఆఫ్ మధు' చిత్రం అక్టోబర్ ఆరో తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాదులో జరిగింది.

ఆ కార్యక్రమానికి మెగా హీరో సాయిధరమ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా తేజ్‌ ని హీరోయిన్ కలర్స్ స్వాతి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా సాయిధరమ్ తేజ్ ని ఒరేయ్ అంటూ ఆమె సంబోధించడం షాకింగ్‌ గా ఉంది.

స్వాతి మాట్లాడుతూ.. జనాలు అంతా కూడా నేను తేజ్ కంటే పెద్ద అనుకుంటారు. కానీ మేమిద్దరం ఒకే క్లాస్... కలిసి చదువుకున్నాం. ఇద్దరి పేర్లలో మొదటి అక్షరం ఎస్ కనుక మాకు ఎగ్జామ్ ఎక్కువ శాతం ఒకేసారి, ఒకే చోట ఉండేది. ప్రాక్టికల్ ఎగ్జామ్ కలిసి రాశాము, నా దాంట్లో చూసి రాశాడు అంటూ సరదాగా వ్యాఖ్యలు చేసింది.

సాయి ధరంతేజ్ కూడా స్వాతి తో పాటు తమ స్నేహాన్ని చెప్పకనే చెప్పాడు. మొత్తానికి ఇద్దరి మధ్య ఇంత మంచి స్నేహం ఉందా అంటూ అంతా షాక్ అవుతున్నారు. స్వాతి ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల క్రితం అడుగు పెట్టింది. కనుక ఆమె వయసు చాలా పెద్దదై ఉంటుందని అంతా భావిస్తున్నారు.

సాయి ధరంతేజ్, ఆమె ఒకే క్లాస్‌ అని తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. వీరిద్దరూ ఇప్పటి వరకు కలిసిన నటించింది లేదు. అలాగే స్టేజ్ పై కలిసి సందడి చేసింది లేదు. మొదటి సారి స్వాతి సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి హాజరయ్యి సాయి ధరమ్ తేజ్ అందర్నీ ఆశ్చర్యపరిచారు. ముందు ముందు వీరి కాంబినేషన్లో ఏమైనా సినిమా వస్తుందో చూడాలి.