Begin typing your search above and press return to search.

మోక్షజ్ఞతో బాలయ్య డైరెక్టర్.. ఏంటి మ్యాటర్

అయితే తాజాగా నందమూరి మోక్షజ్ఞకు- గోపీచంద్ మలినేనికి మధ్య ఓ ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   26 Aug 2023 11:55 AM GMT
మోక్షజ్ఞతో బాలయ్య డైరెక్టర్.. ఏంటి మ్యాటర్
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోల వారసుల ఉన్నారు. వారిలో చాలా మందే తెలుగు తెరకు పరిచయమయ్యారు. అయితే ఇప్పుడు ఎంత మంది వారసులు ఉన్నా.. వారిలో నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపైనే ఎక్కువ చర్చలు జరుగుతూ ఉంటుంది. అతడు ఎప్పుడెప్పుడు సిల్వర్​ స్క్రీన్ ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు వేయి కళ్లతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

అయితే బాలయ్య.. తన వారసుడు మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సరైన కథ, డైరెక్టర్​ కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. ఒకానొక సందర్భంలో ఆయన ఈ విషయంపై ఇంట్రెస్టింగ్​ కామెంట్స్ కూడా చేశారు. తన కొడుకు మొదటి సినిమాను తానే డైరెక్ట్ చేస్తానని కూడా అన్నారు.

ఆ తర్వాత పలువురు దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, శ్రీకాంత్​ ఓదేల వంటి డైరెక్టర్ల పేర్లు ప్రచారం సాగాయి. ఇప్పుడు మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. బాలయ్యతో వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్​ లాంటి సినిమా చేసి.. నందమూరి అభిమానులను బాగా ఆకట్టుకున్నారు గోపిచంద్ మలినేని. అయితే తాజాగా నందమూరి మోక్షజ్ఞకు- గోపీచంద్ మలినేనికి మధ్య ఓ ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది.

వారిద్దరు ఏం మాట్లాడుకున్నారో క్లారిటీగా తెలియదు కానీ.. వీరిద్దరు మాత్రం మంచి ఫ్రెండ్లీ మాట్లాడుకున్నట్లు అర్థమవుతోంది. ఇది చూసిన వారు ఇద్దరు ఓ డీల్​ మాట్లాడుకుంటున్నారని అంటున్నారు. ఏది ఏమైనా ఇది సినిమా కోసమా లేదా ఇంకేదైనా అనేది తెలియాల్సి ఉంది. చూడాలి.. మరి ఫైనల్​గా మోక్షజ్ఞ అరంగేట్రం ఎవరితో చేస్తాడో..

ఇక బాలయ్య విషయానికొస్తే ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నారు. ఈ మూవీ.. త్వరలోనే దసరా సందర్భంగా అక్టోబర్​ 19న గ్రాండ్​గా విడుదల కానుంది. ఇందులో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్​గా నటిస్తోంది. శరత్ కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.