Begin typing your search above and press return to search.

ఒకే ఫ్రేమ్‌లో దిగ్గ‌జ లెజెండ్స్‌

ఓటీటీలు, కామిక్స్‌, డిజిట‌ల్ మీడియా, యానిమేష‌న్‌, వీఎఫ్ ఎక్స్ ఇలా సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన ఎన్నో విష‌యాల‌పై చ‌ర్చించ‌నున్నారు.

By:  Tupaki Desk   |   1 May 2025 10:45 AM
ఒకే ఫ్రేమ్‌లో దిగ్గ‌జ లెజెండ్స్‌
X

అంత‌ర్జాతీయ స్థాయిలో భార‌త్‌ను గ్లోబ‌ల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ హ‌బ్‌గా మార్చాల‌నే ల‌క్ష్యంతో కేంద్ర ప్ర‌భుత్వం `వ‌ర‌ల్డ్ ఆడియో విజువ‌ల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌మ్మిట్ (వేవ్స్‌)ను ముంబ‌యిలో నిర్వ‌హిస్తోంది. ఈ కార్య‌క్ర‌మం మే 1 నుంచి 4 వ‌ర‌కు ముంబ‌యి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతోంది. ఈ కార్య‌క్ర‌మంలో ఇండియ‌న్ సినిమాల గురించి మాత్ర‌మే కాదు. ఓటీటీలు, కామిక్స్‌, డిజిట‌ల్ మీడియా, యానిమేష‌న్‌, వీఎఫ్ ఎక్స్ ఇలా సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన ఎన్నో విష‌యాల‌పై చ‌ర్చించ‌నున్నారు.

కేంద్రం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మంలో భార‌తీయ చ‌ల‌న చిత్ర దిగ్గ‌జాలు పాల్గొన్నారు. ఇక ఈ కార్య‌క్ర‌మాన్ని గురువారం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీప్రారంభించారు. మారుతున్న సాంకేతిక‌త నుంచి యంగ్ జ‌న‌రేష‌న్‌ని కాపాడాల్సిన బాధ్య‌త మ‌న‌పై ఎంతో ఉంద‌న్నారు. ఇదిలా ఉంటే ఈ కార్య‌క్ర‌మంలో ఓ అరుదైన‌స‌న్నివేశం చోటు చేసుకుంది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి ర‌జ‌నీకాంత్‌, చిరంజీవి, మోహ‌న్‌లాల్ ముంబ‌యికి వెళ్లిన విష‌యం తెలిసిందే. ఉత్త‌రాదికి చెందిన న‌టీన‌టులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఒక‌నాటి డ్రీమ్ గ‌ర్ల్, రాజ‌కీయ నేత హేమామాలిని, మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, అక్ష‌య్ కుమార్ కూడా పాల్గొన్పారు. ఈ సంద‌ర్భంగా గురువారం వేవ్స్ వేడుక జ‌రుగుతున్న స‌మ‌యంలో మోహ‌న‌ల్ లాల్‌, ర‌జ‌నీకాంత్‌, హేమామాలిని, చిరంజీవి, అక్ష‌య్ కుమార్‌, మిథున్ చ‌క్ర‌వ‌ర్తి ఒకే ద‌గ్గ‌ర క‌లిసి ఫొటొల‌కు పోజులిచ్చారు. ఈ లెజెండ్స్ అరుదైన క‌ల‌యిక‌కు సంబంధించిన ఫొటోల‌ని మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటో నెట్టింట వైర‌ల్ అవుతోంది.