Begin typing your search above and press return to search.

బెటర్ హాఫ్ తో మెగాస్టార్ వాలెంటైన్ ట్రిప్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ''విశ్వంభర'' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.

By:  Tupaki Desk   |   14 Feb 2024 6:55 AM GMT
బెటర్ హాఫ్ తో మెగాస్టార్ వాలెంటైన్ ట్రిప్!
X

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ''విశ్వంభర'' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. గతేడాది దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాని ప్రారంభించగా.. ఇటీవలే చిరు సెట్స్ లో అడుగుపెట్టారు. అయితే ఇప్పుడు షూటింగ్ నుంచి కాస్త బ్రేక్ తీసుకొని, హాలిడే కోసం విదేశాలకు పయనమయ్యారు.


ఈరోజు (ఫిబ్రవరి) బుధవారం చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి అమెరికాకు వెళ్ళారు. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. "నా బెటర్ హాఫ్ సురేఖతో ఒక చిన్న హాలిడే కోసం యూఎస్ఏకి బయలుదేరాను. నేను తిరిగి వచ్చిన వెంటనే 'విశ్వంభర' చిత్రీకరణను పునఃప్రారంభిస్తాను. మీ అందరినీ త్వరలో కలుస్తా. అందరికీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు" అని చిరు 'ఎక్స్' లో ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఫ్లైట్ లో దిగిన ఫోటోని పంచుకున్నారు.

ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ప్రారంభమైన 'విశ్వంభర' షెడ్యూల్ లో ఓ స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేసినట్లు తెలుస్తోంది. దీని కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్‌ ను నిర్మించగా.. చిరంజీవి వచ్చీ రాగానే కొంతమంది విలన్స్ తో ఫైట్ చేసినట్లుగా సమాచారం. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు చిరు కాళ్లకు ఏదో ప్రాబ్లెం వచ్చి రెండు రోజులు షూటింగ్‌ కు బ్రేక్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. అయితే మళ్లీ తిరిగి చిత్రీకరణ ప్రారంభించి సక్సెస్ ఫుల్ గా ఈ షెడ్యూల్ ని కంప్లీట్ చేసారట. ఈ క్రమంలోనే కాస్త విరామం తీసుకొని ఇప్పుడు హాలిడేకి వెళ్ళినట్లుగా అర్థమవుతోంది.

‘విశ్వంభర’ అనేది పంచభూతాల కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీ అని టాక్. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందనుంది. ఇందులో యాక్షన్ సీన్స్, వీఎఫ్ఎక్స్ ప్రత్యేకంగా నిలవబోతున్నాయి. దీని కోసం 13 భారీ సెట్లు నిర్మించినట్లుగా తెలుస్తోంది. అందులోని ఒక సెట్ లోనే ఈ మధ్యంతా షూటింగ్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన నేపధ్యంలో, పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చిత్రీకరణ పూర్తి చెయ్యాలని భావిస్తున్నారు.

‘విశ్వంభర’ సినిమాలో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. 'స్టాలిన్' తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న రెండో చిత్రమిది. ఇప్పటికే రిలీజైన అనౌన్స్ మెంట్ వీడియో, టైటిల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. 2024 జనవరి 10న ఈ సినిమా విడుదల కాబోతోంది.