Begin typing your search above and press return to search.

మరో స్టార్ డైరెక్టర్ ని లైన్ లో పెట్టిన మెగాస్టార్!

ఆడియన్స్ ఒకప్పటిలా స్టార్ ఇమేజ్ చూసి కథ పట్టించుకోకుండా సినిమా చూసే పరిస్థితి లేదని రియలైజ్ అయిన చిరంజీవి ఆ దిశగా ఆలోచిస్తున్నారు.

By:  Tupaki Desk   |   3 Oct 2023 5:54 AM GMT
మరో స్టార్ డైరెక్టర్ ని లైన్ లో పెట్టిన మెగాస్టార్!
X

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్ లో చేసిన ఐదు సినిమాలలో మూడు రీమేక్ స్టోరీస్ తోనే వచ్చాయి. ఆ మూడు చిత్రాలు కూడా ఆడియన్స్ ని పూర్తిగా నిరాశపరిచాయి. డిజిటల్ యుగంలో ఒరిజినల్ సినిమాలని కూడా భాషలతో సంబంధం లేకుండా ఆడియన్స్ చూసేస్తున్నారు. మళ్ళీ అదే కథలో ఇంకో హీరోని చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మెగాస్టార్ కి భోళా శంకర్ మూవీ ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చింది.

ఆడియన్స్ ఒకప్పటిలా స్టార్ ఇమేజ్ చూసి కథ పట్టించుకోకుండా సినిమా చూసే పరిస్థితి లేదని రియలైజ్ అయిన చిరంజీవి ఆ దిశగా ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా కళ్యాణ్ కృష్ణతో బ్రో డాడీ రీమేక్ చేద్దామని అనుకోని మళ్ళీ పక్కన పెట్టారు. వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని అనుకుంటున్నారంట. త్రివిక్రమ్ స్టైల్ లో సాగే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో మంచి సినిమాని ప్రేక్షకులకి అందించాలని భావిస్తున్నారు. ఈ విషయం త్రివిక్రమ్ దృష్టికి తీసుకొని వెళ్ళడంతో ఆయన కూడా ఓకే ప్లాట్ సిద్ధం చేసుకునే పనిలో పడ్డారని టాక్.

గుంటూరు కారం సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. దీని తర్వాత త్రివిక్రమ్ తో మూవీ అనుకున్న బన్నీ మాత్రం అట్లీతో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నారంట. అదే జరిగితే త్రివిక్రమ్ కి ఎలాగూ గ్యాప్ వస్తుంది కాబట్టి ఈ లోపు మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమాని కంప్లీట్ చేసేయొచ్చు.

వశిష్ట మల్లిడి మూవీ సెట్స్ పైన ఉన్న కూడా విఎఫ్ఎక్స్ బేస్డ్ మీద ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ షెడ్యూల్ కి గ్యాప్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ టైంలో త్రివిక్రమ్ మూవీ పూర్తి చేయొచ్చని చిరంజీవి యోచిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల మాట.