Begin typing your search above and press return to search.

అందుకు మెగాస్టార్ అర్హుడు

అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టకి టాలీవుడ్‌ నుంచి మెగాస్టార్ చిరంజీవి కి మాత్రమే ఆహ్వానం లభించిన విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   23 Jan 2024 5:38 AM GMT
అందుకు మెగాస్టార్ అర్హుడు
X

అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టకి టాలీవుడ్‌ నుంచి మెగాస్టార్ చిరంజీవి కి మాత్రమే ఆహ్వానం లభించిన విషయం తెల్సిందే. సతీ సమేతంగా, కొడుకుతో పాటు ప్రాణ ప్రతిష్ట కు మెగాస్టార్ చిరంజీవి హాజరు అయ్యారు. ఆ విషయమై ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలకు కథలను అందించిన విజయేంద్ర ప్రసాద్‌ బాలీవుడ్‌ కి చెందిన పలు సూపర్ హిట్ చిత్రాలకు కూడా కథలు అందించిన విషయం తెల్సిందే. తాజాగా ఒక మీడియా సంస్థకు విజయేంద్ర ప్రసాద్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి ప్రస్తావన వచ్చింది.

టాలీవుడ్‌ నుంచి చిరంజీవి గారికి మాత్రమే అయోధ్యలో జరిగిన రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం అందడం పట్ల మీ అభిప్రాయం ఏంటి అంటూ ప్రశ్నించిన సమయంలో ఆయన మాట్లాడుతూ... తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి అగ్ర కథానాయకుడు. ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా టాలీవుడ్‌ కు ఆయన పెద్ద దిక్కు.

ఒకప్పుడు దాసరి నారాయణ రావు గారు ఉండేవారు, ఇప్పుడు ఆ స్థానం చిరంజీవి గారిది అనడంలో సందేహం లేదు. కనుక అలాంటి కార్యక్రమాలకు ఆహ్వానం అందుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి గారు పూర్తి అర్హులు అంటూ విజయేంద్ర ప్రసాద్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్‌ చేసిన ఆ వ్యాఖ్యలను సోషల్‌ మీడియాలో తెగ షేర్‌ చేస్తున్నారు. దాంతో రచయిత వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ వైరల్‌ అవుతున్నాయి. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.