Begin typing your search above and press return to search.

క్రిస్మ‌స్ వేడుక‌ల్లో మెగా క‌పుల్స్ సెల‌బ్రేష‌న్

ఈ వేడుక‌లో రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ పాల్గొన్నారు.

By:  Tupaki Desk   |   26 Dec 2023 3:54 AM GMT
క్రిస్మ‌స్ వేడుక‌ల్లో మెగా క‌పుల్స్ సెల‌బ్రేష‌న్
X

2023 మెగా కాంపౌండ్ కి అన్నివిధాలా క‌లిసొచ్చిన సంవ‌త్స‌రం. అందుకు త‌గ్గ‌ట్టే మెగా హీరోల జోష్ స్కైని తాకుతోంది. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా టాలీవుడ్ మెగా ఫ్యామిలీ 'గ్రాండ్ ఫ్యామిలీ గ్యాదరింగ్'కి సంబంధించిన ఫోటోని షేర్ చేసారు. ఈ ఫోటోగ్రాఫ్ చిరంజీవి కుటుంబంలోని యువ హీరోల న‌డుమ‌ నిజమైన బంధాన్ని ఆవిష్క‌రించింది. ఈ వేడుక‌లో రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ పాల్గొన్నారు. ముఖ్యంగా కొత్త జంట వ‌రుణ్ తేజ్ - లావ‌ణ్య ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలవ‌గా, ఇందులో చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న‌, బ‌న్ని స‌తీమ‌ణి స్నేహ ఉండ‌డంతో క‌పుల్ పార్టీ వైబ్ ని క్రియేట్ చేసింది. బ‌న్ని వాస్ ఆయ‌న స‌తీమ‌ణి కూడా ఈ పార్టీలో సెంట‌ర్ స్టేజ్ తీసుకోవ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. ఇదే పార్టీలో బ్యాచిలర్ హీరోలు సాయిధ‌ర‌మ్, శిరీష్ సంద‌డి క‌నిపించింది.


ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోను షేర్ చేసిన‌ వరుణ్ తేజ్ మెగాభిమానులందరికీ మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. వేదిక వ‌ద్ద అద్బుత‌మైన‌ లైటింగ్ అలంక‌ర‌ణ‌తో గ్రాండ్ క్రిస్మస్ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీలో డ్రెస్ కోడ్ కూడా ఆస‌క్తిని క‌లిగించింది. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్, ఉపాసన కొణిదెల రెడ్ కలర్ పార్టీ థీమ్ ని ఎంచుకోగా అల్లు అర్జున్ ,రామ్ చరణ్ నలుపు దుస్తులను ధరించారు. ఈ పార్టీ ఫోటోని షేర్ చేసిన మెగా స్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల "మా అందరి నుండి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, ప్రతి ఒక్కరికి చాలా చీర్స్.. ప్రేమను అందుకోండి" అని రాశారు.

మెగా ఫ్యామిలీ వేడుకలంటే అభిమానుల‌కు ఎప్పుడూ ఆస‌క్తి. ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా మెగా కుటుంబ వేడుక‌లు అభిమానులకు ట్రీట్‌ను అందిస్తాయి. గత సంవత్సరం కూడా క్రిస్మ‌స్ పండుగ‌ను అద్భుతంగా సెల‌బ్రేట్ చేసారు. కానీ ఈసారి రామ్ చరణ్- అల్లు అర్జున్ ఈ పార్టీలో కలిసి క‌నిపించ‌డంతో అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేవ్. వ‌చ్చే కొత్త‌ సంవత్సరంలో ఈ ఇద్ద‌రూ న‌టించిన సినిమాలు రిలీజ్ కి రానున్నాయి. చ‌ర‌ణ్- గేమ్ ఛేంజ‌ర్, బ‌న్ని- పుష్ప 2 కొత్త ఏడాదిలో విడుద‌ల‌వుతాయి. వరుణ్ తేజ్ 2024లో మానుషి చిల్లార్‌తో కలిసి 'ఆపరేషన్ వాలెంటైన్‌'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్న సంగ‌తి తెలిసిందే.