Begin typing your search above and press return to search.

ఇదే జరిగితే మీనాక్షికి తిరుగుండదు

ఈ సినిమాలో ఆమె మహేశ్ బాబుకు మరదలుగా నటించిందని సమాచారం. ఈ మూవీలో శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయినప్పటికీ ఈమె పాత్రకు ఫుల్ స్కోప్ ఉందట.

By:  Tupaki Desk   |   7 Jan 2024 9:03 AM GMT
ఇదే జరిగితే మీనాక్షికి తిరుగుండదు
X

మీనాక్షి చౌదరి.. డాక్టర్ అయిన ఈ అమ్మడు తొలిసారి ఇచ్చట వాహనములు నిలుపరాదు అంటూ సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత రవితేజ సరసన ఖిలాడి చిత్రంలో నటించింది. అయినా ఈ భామకు సరైనా హిట్ పడలేదు. అడవి శేష్ సూపర్ హిట్ మూవీ హిట్-2లో నటించినా.. అనుకున్నంత స్థాయిలో అవకాశాలు దక్కించుకోలేకపోయంది.

అందం, టాలెంట్ ఉన్నా టాలీవుడ్ లో ఛాన్సులు అందుకోలేకపోయింది. కానీ అనూహ్యంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన గుంటూరు కారం మూవీలో నటించే సూపర్ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా పూజా హెగ్డేను అనుకున్న సంగతి తెలిసిందే. ఆమె తప్పుకోవడంతో మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. దీంతో ఆమె స్టార్ హీరోయిన్ క్రేజ్ కొట్టేసింది.

ఇటీవల గుంటూరు కారం నుంచి మీనాక్షి చౌదరి లుక్ కూడా బయటకు వచ్చింది. అందులో పల్లెటూరి అమ్మాయిలా లంగావోణీ వేసుకుని చాలా అందంగా కనిపించింది. ఈ సినిమాలో ఆమె మహేశ్ బాబుకు మరదలుగా నటించిందని సమాచారం. ఈ మూవీలో శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయినప్పటికీ ఈమె పాత్రకు ఫుల్ స్కోప్ ఉందట.

దీంతో ఈ సినిమాపై మీనాక్షి చాలా హోప్స్ పెట్టుకుందట. ఇప్పటి వరకు పెద్ద సక్సెస్ అందుకోపోయిన ఈ బ్యూటీ.. వరుస అవకాశాలతో బిజీగా మారాలని చూస్తోందట. మొన్నటి వరకు కూడా మీనాక్షి చౌదరి పేరు జనాలకు పెద్దగా తెలియకపోయినా.. ఒక్క మహేశ్ మూవీతో ఫుల్ ఫేమస్ అయిందని నెటిజన్లు అంటున్నారు. మహేశ్ సరసన నటించాక ఫేట్ మారిపోనుందని, ఈ సినిమా ఆమె కెరీర్ దశను మార్చేస్తుందని చెబుతున్నారు.

మరోవైపు, ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో జాక్ పాట్ ఆఫర్ అందుకుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కనున్న ఆర్ సీ 16 సినిమాలోను సెకండ్ హీరోయిన్ గా ఈ భామ సెలెక్ట్ అయిందట. దీంతో మీనాక్షి చౌదరి బంపర్ ఆఫర్ కొట్టిందని నెటిజన్లు అంటున్నారు.

ప్రస్తుతం మీనాక్షి కోలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తుండగా... టాలీవుడ్ లో రెండు సినిమాలకు కమిట్ అయినట్లు తెలుస్తోంది. గుంటూరు కారం రిలీజ్ కాకముందే ఈ భామ ఇన్ని ఆఫర్లు కొట్టేయడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా మహేశ్ బాబు క్రేజ్ అంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.