Begin typing your search above and press return to search.

ఇంకో కమెడియన్ హీరోగా..

అలా ఈ జనరేషన్ లో ఇప్పటికే కమెడియన్ సత్య హీరోగా మారి మంచి సక్సెస్ అందుకున్నాడు

By:  Tupaki Desk   |   22 Jan 2024 11:05 AM GMT
ఇంకో కమెడియన్ హీరోగా..
X

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్లు హీరోగా మారడం సర్వసాధారణమే. అయితే కొంతమంది కమేడియన్స్ హీరోగా మారి సక్సెస్ అందుకుంటే.. మరకొంతమంది అనవసరంగా ప్రయోగాలు చేసి ఉన్న కెరియర్ పాడు చేసుకున్నారు. ఇక ఈ తరంలో యంగ్ కమెడియన్స్ తమ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ మంచి పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో కొద్దిమంది హీరోలుగా మారుతున్నారు.


అలా ఈ జనరేషన్ లో ఇప్పటికే కమెడియన్ సత్య హీరోగా మారి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇటీవల వెన్నెల కిషోర్ కూడా హీరోగా మారి ఓ క్రైం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తో ఒక ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ లిస్టులో మరో కమెడియన్ అభినవ్ గోమఠం కూడా చేరిపోయాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన 'ఈ నగరానికి ఏమైంది' అనే సినిమాతో కమెడియన్ గా ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు అభినవ్.

ఈ సినిమాలో తన కామెడీ, డైలాగ్ డెలివరీతో యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత అభినవ్ కి భారీ పాపులారిటీ వచ్చింది. దాంతో స్టార్ హీరోల సినిమాల్లోనూ కమెడియన్గా మెప్పించాడు. ఈ నగరానికి ఏమైంది తర్వాత మీకు మాత్రమే చెప్తా, సేవ్ ది టైగర్స్ వంటి సినిమాల్లో తన కామెడీతో ఆకట్టుకున్నాడు. ఓవైపు కమెడియన్గా నటిస్తూనే ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ నగరానికి ఏమైంది సినిమాలోని తన డైలాగ్ నే తన ఫస్ట్ మూవీకి టైటిల్ గా పెట్టుకున్నాడు.' మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' అనే టైటిల్ తో అభినవ్ గోమటం కొత్త సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్లో అక్కడి స్టూడెంట్స్ తో కలిసి తరుణ్ భాస్కర్ టైటిల్ లోగోని రిలీజ్ చేశారు. తిరుపతిరావు ఇండ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాసుల క్రియేటివ్ వర్క్స్ పతాకంపై భవానీ కాసుల, ఆర్ఎం రెడ్డి, ప్రశాంత్. వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

టైటిల్ లోగో రిలీజ్ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.." కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన నటనతో ప్రశంసలు అందుకున్న అభినవ్ గోమటంలోని మరో కొత్త కోణాన్ని ఈ సినిమాలో చూస్తారు. అయోధ్యలోని శ్రీ సీతారాముల ప్రాణ ప‌తిష్ట రోజే మా సినిమా లోగోను ఆవిష్క‌రించ‌డం ఎంతో ల‌క్కీగా భావిస్తున్నాం. అన్నిభావోద్వేగాల మేళ‌వింపుతో ల‌వ్‌, కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నా. కొత్త‌దనంతో కూడిన ఈ చిత్రం త‌ప్ప‌కుండా అంద‌ర్ని అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది. ఫిబ్ర‌వ‌రి ద్వితియార్థంలో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం" అని తెలిపారు.