Begin typing your search above and press return to search.

రవితేజ మాస్ కాంబో.. రిలీజ్ టార్గెట్ ఫిక్స్

ఈ సినిమాకి కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఫిక్షనల్ లైన్ లో గోపీచంద్ మలినేని సిద్ధం చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   5 Aug 2023 3:55 AM GMT
రవితేజ మాస్ కాంబో.. రిలీజ్ టార్గెట్ ఫిక్స్
X

మాస్ మహారాజ్ రవితేజ అందరికంటే స్పీడ్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. బ్యాక్ టూ బ్యాక్ రవితేజ నుంచి సినిమాలు వస్తూ ఉన్నాయి. ఈ ఏడాది లో ఇప్పటి వరకు వాల్తేర్ వీరయ్య, రావణాసుర సినిమాలు రిలీజ్ అయ్యాయి. టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ కి సిద్ధం అవుతోంది. దసరా బరి లో ఈ మూవీ ప్రేక్షకులని అలరించడానికి వస్తోంది.

దీని తర్వాత కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో చేస్తోన్న ఈగల్ సినిమా వచ్చే ఏడాది సంక్రాతికి రిలీజ్ చేయాలని టైం ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నాలుగో సినిమాకి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. చివరిగా వచ్చిన క్రాక్ మూవీ రవితేజ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాల లో ఒకటిగా ఉంది.

ఇప్పుడు మరోసారి ఇద్దరు జోడీ కడుతున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతోంది. ఈ సినిమాకి కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఫిక్షనల్ లైన్ లో గోపీచంద్ మలినేని సిద్ధం చేసుకున్నారు. మే 7 లేదా 17 తేదీలలో మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ రవితేజకి జోడీగా ఫైనల్ అయినట్లు టాక్.

ఇక షూటింగ్ స్టార్ట్ చేసి రెగ్యులర్ షూట్ కి వెంటనే వెళ్ళబోతున్నారంట. అలాగే 2024 మేలో రిలీజ్ లక్ష్యంగా సినిమాని కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారంట. ఈగల్ మూవీ షూటింగ్ కూడా ఇప్పటికే చాలా వరకు కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించి పూర్తి సమాచారం బయటకొచ్చే ఛాన్స్ ఉంది.

గోపీచంద్ మైత్రీ మూవీ మేకర్స్ కి ఈ ఏడాది వీరసింహారెడ్డితోసాలిడ్ హిట్ ఇచ్చాడు. ఈ మూవీ సంక్రాతి రేసు లో వచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. అయితే మైత్రీ మూవీ మేకర్స్ లో రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ చేసి డిజాస్టర్ ఇచ్చారు. ఇప్పుడు గోపీచంద్ తో కలిసి సూపర్ హిట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.