Begin typing your search above and press return to search.

అంబానీ వేడుకలో మెరిసిన మంచు కపుల్!

ముంబైలో జరిగిన జియో వరల్డ్ ప్లాజా వేడుక స్టార్ సెలబ్రిటీల హడావిడి తో జోరుగా కొనసావింది. ఇక ఈ కార్యక్రమంలో మంచు కపుల్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

By:  Tupaki Desk   |   1 Nov 2023 3:30 PM GMT
అంబానీ వేడుకలో మెరిసిన మంచు కపుల్!
X

ముంబైలో జరిగిన జియో వరల్డ్ ప్లాజా వేడుక స్టార్ సెలబ్రిటీల హడావిడి తో జోరుగా కొనసావింది. ఇక ఈ కార్యక్రమంలో మంచు కపుల్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. మంచు మనోజ్ అతని భార్య మౌనిక భూమా రెడ్డి రెడ్ కార్పెట్‌పై పవర్ కపుల్‌గా కనిపించారు. వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీతో ఈ జంట నవ్వుతూ కనిపించారు. ఇతర అతిథులు కూడా వేడుకలో హాజరయ్యారు. ఇక రిలయన్స్‌ బాస్‌తో ప్రత్యేకంగా ఫొటోలకు స్టిల్స్ ఇచ్చారు.


ఈ స్టార్-స్టడెడ్ ఈవెంట్‌లో బాలీవుడ్ నుండి సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, అలియా భట్, సారా అలీ ఖాన్, సోనమ్ కపూర్, కరీనా & కరిష్మా కపూర్, జాన్ అబ్రహం అలాగే అంతర్జాతీయ మోడల్స్ మరియు ఫ్యాషన్‌ల హోస్ట్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. అతిథి జాబితాలో సౌత్ ఇండస్ట్రీ నుండి మనోజ్ మంచు మరియు మౌనిక భూమాలకు మాత్రమే ఆహ్వానం దక్కింది.


ఈ కార్యక్రమం గురించి నటుడు మనోజ్ మంచు మాట్లాడుతూ, "ఇది అద్భుతమైన సాయంత్రం, అన్ని విధాలా సంతోషించాల్సిన సమయం. మౌనిక నేను మిస్టర్ అంబానీతో సుదీర్ఘమైన చర్చలు జరపడం హ్యాపీగా అనిపించింది. ఆయన గెస్ట్ లను అహ్వానించడం లో చాలా గొప్పవారు ఇక మౌనిక మాట్లాడుతూ.. "ఈ ఈవెంట్ యొక్క హైలైట్ ఖచ్చితంగా మిస్టర్ అంబానీ మరియు అతని కుటుంబాన్ని కలవడం ఎప్పటికి మర్చిపోలేము. వారు నిజంగా వినోద ప్రపంచాన్ని పునర్నిర్వచిస్తున్నారు. మాకు కూడా వారు తీసుకునే నిర్ణయాలపై ఆసక్తి ఉంది.. అని మౌనిక అన్నారు.


ఇక మనోజ్ మంచు సినిమాల విషయానికి వస్తే.. లిస్టులో ఒక బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూట్ కోసం సిద్ధమవుతున్నాడు. అలాగే నిర్మాణంలో ఉన్న మరో అద్భుతమైన హై ఆక్టేన్ యాక్షన్ ఫిల్మ్‌లో కూడా పని చేస్తున్నాడు. ఇంకా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కింద ETV విన్ కోసం భారతదేశపు అతిపెద్ద OTT గేమ్ షో కోసం మనోజ్ మంచు షూటింగ్ చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన మరొక కీలకమైన అప్డేట్ను మంచు మనోజ్ ప్రకటించబోతున్నాడు. ఇక వచ్చే ఏడాది తన మొదటి పాన్ ఇండియా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు