Begin typing your search above and press return to search.

మనోజ్ ఉస్తాద్ షో.. ఎలా ఉండబోతోందంటే..

మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ గేమ్ షో లో ప్రైజ్ మనీ కూడా ఉంటుందట. ఈ గేమ్ షో లో స్టార్ గెస్ట్ లు పాల్గొని గేమ్ ఆడుతారు.

By:  Tupaki Desk   |   10 Dec 2023 5:50 PM GMT
మనోజ్ ఉస్తాద్ షో.. ఎలా ఉండబోతోందంటే..
X

మంచు మనోజ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్న మనోజ్ కెరియర్ పరంగా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. సినిమాలతో పాటు బుల్లితెరపై ఓ సరికొత్త గేమ్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. 'ఉస్తాద్' అనే టైటిల్ తో ఈ గేమ్ షో ఉండబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

'ర్యాంప్ ఆడిద్దాం' అనేది ట్యాగ్ లైన్. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా నిర్మాణంలో తెలుగు ఓటీటీ ఈటీవీ విన్ లో ఈ రియాలిటీ గేమ్ షో ప్రసారం కానుంది. రీసెంట్గా ప్రోమో కూడా రిలీజ్ అయింది. సెలబ్రిటీస్ తో మాట్లాడుతూ వాళ్లతో ఆటలు ఆడించడం ఈ గేమ్ షో ప్రత్యేకత. కాగా ఈ గేమ్ షోలో ఫస్ట్ సెలబ్రిటీగా న్యాచురల్ స్టార్ నాని హాజరు కాబోతున్నారు. ఇదే విషయాన్ని మంచు మనోజ్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ గేమ్ షో లో ప్రైజ్ మనీ కూడా ఉంటుందట. ఈ గేమ్ షో లో స్టార్ గెస్ట్ లు పాల్గొని గేమ్ ఆడుతారు. ఆ గేమ్ లో గెలిచిన ప్రైజ్ మనీని వారి అభిమానులకు ఇస్తారు. ప్రతి ఎపిసోడ్ కి 50 లక్షల ప్రైజ్ మనీ ఉంటుంది. ఈటీవీ విన్ లో డిసెంబర్ 15 నుంచి ఈ గేమ్ షో ప్రసారం కానుంది. కాగా ఈ షో ఫస్ట్ గెస్ట్ నాచురల్ స్టార్ నాని అని మనోజ్ తన సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడిస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశాడు.

అందులో నాని కి కిస్ ఇస్తూ కనిపించాడు మనోజ్. ఇక నానితో పాటూ మాస్ మహారాజా రవితేజ, యంగ్ హీరో అడవి శేష్ కూడా ఈ షో కి గెస్ట్ గా రాబోతున్నారట. ప్రస్తుతం వీళ్ళతో మనోజ్ షూటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. వీరితో పాటూ రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలను సైతం మనోజ్ గేమ్ షో కి తీసుకొచ్చేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా ఫస్ట్ సీజన్లో మంచు ఫ్యామిలీ నుంచి ఎవరు ఈ షోకి హాజరుకారని టాక్ వినిపిస్తోంది.

ఓటీటీలో మనోజ్ ఫస్ట్ టైం హోస్ట్ చేయబోతున్న రియాలిటీ గేమ్ షో కావడంతో ఈ షోపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. మరి ఉస్తాద్ రియాలిటీ షోలో ఎవరెవరు సెలబ్రిటీ గెస్ట్ లుగా రాబోతున్నారు? వాళ్ళందరితో మనోజ్ చేసే సందడి ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఇక మంచు మనోజ్ సినిమాల విషయానికొస్తే.. 'వాట్ ద ఫిష్' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. వరుణ్ అనే డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. డార్క్ కామెడీ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో పాటు 'అహం బ్రహ్మాస్మి' అనే మరో ప్రాజెక్టు చేస్తున్నాడు మంచు మనోజ్.