Begin typing your search above and press return to search.

మంజుమ్మల్ బోయ్స్.. తెలుగులో ఫస్ట్ అచీవ్మెంట్..!

సినీ ప్రముఖుల సమక్షంలో మంజుమ్మల్ బోయ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

By:  Tupaki Desk   |   4 April 2024 6:34 AM GMT
మంజుమ్మల్ బోయ్స్.. తెలుగులో ఫస్ట్ అచీవ్మెంట్..!
X

మలయాళంలో రీసెంట్ గా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా మంజుమ్మల్ బోయ్స్. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి లీడ్ రోల్ లో చిదంబరం ఎస్ పొదువల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మలయాళంలో 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సెన్సేషనల్ రికార్డ్ అందుకుంది. పరవ ఫిలింస్ బ్యానర్ లో బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని నిర్మించిన మంజుమ్మల్ బోయ్స్ ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తుంది. తెలుగులో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 6న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సినీ ప్రముఖుల సమక్షంలో మంజుమ్మల్ బోయ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. ట్రెమండస్ సక్సెస్ ని అందుకున్న 'మంజుమ్మల్ బాయ్స్' టీంకి అభినందనలు. తెలుగు రిలీజ్ కి ఆల్ ది బెస్ట్. మైత్రీ శశి గారు ఈ సినిమా రైట్స్ తీసుకున్నామని చెప్పారు. సినిమా గురించి చాలా గొప్పగా వింటున్నాని చెప్పాను. ఈ మధ్య మలయాళం చిన్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళిన ప్రేమలు, 'మంజుమ్మల్ బాయ్స్' చూశారా అని అడుగుతున్నారు. తెలుగులో కూడా ఇంకా మంచి సినిమాలు వస్తాయి. ఈ సినిమాలని ఆదరిస్తే అటువంటు ధైర్యం మనకీ వస్తుంది. టీం అందరికీ మరోసారి ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.

యాక్టర్ శ్రీనాథ్ భాసి మాట్లాడుతూ.. మీ అందరి ఆదరణకు ధన్యవాదాలు. పాటలు, ట్రైలర్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. తెలుగు వెర్షన్ చూడటానికి మేము ఆసక్తిగా ఎదురుచుస్తున్నాం అన్నారు.

యాక్టర్ అరుణ్ కురియన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకని ఇంత ఘనంగా నిర్వహించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు ధన్యవాదాలు. తప్పకుండా అందరూ సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరారు

విష్ణు రవి మాట్లాడుతూ.. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. మీరు కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరూ థియేటర్స్ లోనే చూడండి, మైత్రీ మూవీ మేకర్స్ కి ధన్యవాదాలు చెప్పారు.

నిర్మాత శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా రైట్స్ కొనుగోలు చేయడానికి హెల్ప్ చేసిన షాన్, అనుప్ లాల్ కి ధన్యవాదాలు. మొదటి రోజు ఈ సినిమా చూసిన వెంటనే సినిమాని తెలుగులో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. రవి గారు నవీన్ గారు ఈ సినిమాని ఇక్కడ గ్రాండ్ గా ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. ఇది బ్లాక్ బస్టర్ అని ముందే అనుకున్నాం. ఈ సినిమాకి లాంగ్వేజ్ బారియర్ లేదు. ఇది పదిమంది బాల్య స్నేహితులకు సంబధించిన కథ. ఇలాంటి స్నేహితులు జీవితంలో ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. నా జీవితంలో రవి కూడా లాంటి గొప్ప స్నేహితుడు. నిరాశలో ఉన్న కాలంలో ఎంతో స్ఫూర్తిని ఇచ్చారు. ఈ రకంగా ఈ సినిమా నా మనుసుకి చాలా దగ్గరరైయింది. ఏప్రిల్ 6న తెలుగులో సినిమా విడుదలౌతుంది. ఏప్రిల్ 5న ప్రిమియర్స్ కూడా వేస్తున్నాం. మలయాళం సినిమా పెయిడ్ ప్రిమియర్స్ వేయడం ఇదే తొలిసారి. ఇది బిగ్ ఎచీవ్మెంట్. ఇది డబ్బింగ్ సినిమాల కాకుండా స్ట్రయిట్ సినిమాలనే దాదాపు 300 వందల స్క్రీన్స్ లో గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం. ఈ సినిమా కోసం మాతో కలసి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది చాలా పెద్ద సినిమా. అందుకే ఎక్కడా రాజీపడకుండా మైత్రీ సొంత సినిమాలానే చేశాం. అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. ఈ సినిమాని యుఎస్ లో చూశాను. ఎక్స్ ట్రార్డినరీ ఫిలిం. ఈ మధ్య కాలంలో చూసిన బెస్ట్ ఫిలిం. సినిమా యూనిట్ అందరికీ అభినందనలు. ఈ సినిమా ఇప్పటికే 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బిగ్ హిట్ అయ్యింది. తెలుగు లో కూడా పెద్ద విజయాన్ని సాధిస్తుంది. తెలుగు ప్రేక్షకులందరు ఇష్టపడతారు. విజువల్స్, మ్యూజిక్ ఎక్స్ ట్రార్డినరీ. ఏప్రిల్ 6న సినిమా రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా థియేటర్స్ కి వచ్చి చూడండి. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారని అన్నారు.

నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. 'మంజుమ్మల్ బాయ్స్' టీంకు అభినందనలు. తెలుగు వెర్షన్ ని విడుదల చేయడానికి అవకాశం ఇచ్చిన షాన్ కు ధన్యవాదాలు. ఏప్రిల్ 6న సినిమా విడుదలౌతుంది. 5న స్పెషల్ ప్రిమియర్స్ వేస్తున్నాము. మలయాళంలానే తెలుగులో కూడా సినిమా పెద్ద విజయం సాధిస్తుందని భావిస్తున్నాం.

దర్శకుడు చిదంబరం మాట్లాడుతూ.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు ధన్యవాదాలు. మాకు ఇంత గొప్పగా స్వాగతం పలికిన అందరికీ ధన్యవాదాలు. అందరూ ఏప్రిల్ 6న థియేటర్స్ కి వచ్చి మంజుమ్మల్ బాయ్స్ సినిమా చూడండి. మీ స్పందన కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు.