వీడియో : పబ్లిక్లో హీరోయిన్కి చేదు అనుభవం
ఆ కార్యక్రమంలో పాల్గొని బయటకు వచ్చిన సమయంలో మంజు వారియర్ను చూసేందుకు చాలా మంది అభిమానులు, స్థానికులు అక్కడకు చేరుకున్నారు.
By: Tupaki Desk | 3 May 2025 1:30 PMసెలబ్రెటీలు రోడ్డుపై, పబ్లిక్లో ప్రశాంతంగా తిరిగే పరిస్థితి లేదు. ఎక్కడ నుంచి ఎవరు వచ్చి సెల్ఫీ అడిగి మీద పడుతారో అనే ఆందోళన అందరిలోనూ కనిపిస్తుంది. బౌన్సర్స్తో బయటకు వెళ్లినా కూడా ఏదో ఒక సమయంలో, సందర్భంలో సెలబ్రెటీలు ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇటీవల మలయాళ సీనియర్ హీరోయిన్ మంజు వారియర్ కి చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో అభిమానం పేరుతో కొందరు ఆమెపై ఎగబడే ప్రయత్నం చేశారు. ఆమె చాలా సౌమ్యంగా వారితో వ్యవహరించి, వారు కోరుకున్నట్లుగా సెల్ఫీ కూడా ఇచ్చింది. అయినా ఆమె పట్ల జనాలు వ్యవహరించిన తీరు చర్చనీయాంశం అవుతుంది.
ఆ కార్యక్రమంలో పాల్గొని బయటకు వచ్చిన సమయంలో మంజు వారియర్ను చూసేందుకు చాలా మంది అభిమానులు, స్థానికులు అక్కడకు చేరుకున్నారు. వారి తోపులాట నుంచి మంజు వారియర్ను కాపాడేందుకు బౌన్సర్లు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ సమయంలో ఒక ఆకతాయి మంజు వారియర్ డ్రెస్ను పట్టుకుని లాగే ప్రయత్నం చేశాడు, మరో వ్యక్తి ఆమెను తడిమేందుకు సాధ్యం అయినంత వరకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరోయిన్స్ బయటకు వెళ్లిన సమయంలో ఎలా ఇబ్బంది పడాల్సి వస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు.
మంజు వారియర్ సినిమాల విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి ఫుల్ బిజీగా ఉంది. నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా హీరోయిన్గా సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకుంటుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేయడం ద్వారా ఏడాది అంతా ఈమె సినిమాలు థియేటర్లో ఉన్న ఫీల్ ఉందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. గత ఏడాది ఈమె నటించిన ఫుటేజ్, వేట్టయాన్, విడుదల పార్ట్ 2 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. విడుదల పార్ట్ 2 సినిమాలో ఈమె పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే నటించి మెప్పించింది. లుక్ పరంగా మంజు వారియర్ సర్ప్రైజ్ చేసింది.
ప్రస్తుతం మంజు వారియర్ చేస్తున్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే ఎల్ 2 : ఎంపురాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో రూపొందిన ఎల్ 2 సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. లూసీఫర్కి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమాకు దాదాపుగా రూ.200 కోట్ల వసూళ్లు నమోదు అయినట్లు సమాచారం అందుతోంది. అతి త్వరలోనే ఈమె మిస్టర్ ఎక్స్తో పాటు మరో రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగులో ఈమెను ఎప్పుడెప్పుడు సీనియర్ హీరోలకు జోడీగా చూస్తామా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వయసు పెరిగినా కొద్ది అందంగా కనిపించే మంజు వారియర్ మరో పదేళ్ల పాటు ఇండస్ట్రీలో బిజీగా ఉండే అవకాశాలు ఉన్నాయి.