Begin typing your search above and press return to search.

మకాం మార్చిన మంచు లక్ష్మి.. ఇకపై అక్కడే

మంచు లక్ష్మీ హైదరాబాద్​ నుంచి ముంబకి మకాం మార్చిందా? హిందీ సినిమాలు, సిరీస్​ల్లో నటించేందుకు రెడీ అవుతుందా? అంటే అవుననే అనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   12 Oct 2023 11:58 AM GMT
మకాం మార్చిన మంచు లక్ష్మి.. ఇకపై అక్కడే
X

మంచు లక్ష్మీ హైదరాబాద్​ నుంచి ముంబకి మకాం మార్చిందా? హిందీ సినిమాలు, సిరీస్​ల్లో నటించేందుకు రెడీ అవుతుందా? అంటే అవుననే అనిపిస్తోంది. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. తాజాగా ఓ ట్వీట్​తో ఈ విషయాన్ని ధృవీకరించింది. ప్రస్తుతం ఈ ట్వీట్​ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

వివరాళ్లోకి వెళితే.. రీసెంట్​గా మంచు లక్ష్మీ మొన్న జరిగిన రకుల్ బర్త్ డే పార్టీలో సందడి చేసిన సంగతి తెలిసిందే. హీరోయిన్స్​​ ప్రగ్యా జైస్వాల్, రకుల్ ప్రీత్​తో కలిసి సరదాగా ఎంజాయ్ చేసింది. వారి బర్త్ డే పార్టీకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అయ్యాయి. ఇదే సమయంలో ఆమె ముంబయికి షిఫ్ట్ అయిందనే వార్తలు కూడా వచ్చాయి.

త్వరలోనే మంచు లక్ష్మి హిందీ సినిమా, సిరీస్​ల్లో నటించనుందని ప్రచారం సాగింది. అయితే తాజాగా ఈ విషయంపై మంచు లక్ష్మి స్పందించింది. "కొత్త నగరం, కొత్త యుగం. ఈ జీవితానికి చాలా కృతజ్ఞతలు. ఎప్పుడూ నన్ను ఆదరిస్తున్నందుకు, నన్ను విశ్వసిస్తున్నందుకు నా అభిమానులందరికీ ధన్యవాదాలు" అంటూ చెప్పుకొచ్చింది.

ఈ ట్వీచ్ చూసిన నెటిజన్లు.. బాలీవుడ్​ను ఏలడానికి వెళ్ళావా అక్కా అని కొందరు కామెంట్లు చేస్తుంటే.. మరి కొందరు మంచు పేరు నిలబెట్టాలి అంటూ అభిప్రాయపడుతున్నారు. నీకు హిందీ వచ్చా అక్కా? ఇప్పటి వరకు తెలుగు, ఇంగ్లీష్ కలిపిన యాసను విన్నాం.. ఇప్పుడు ఇంగ్లీష్ హిందీ మిక్స్ అయిన యాసను చూస్తామంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. మరి మంచు లక్ష్మీ అక్కడ ఎలాంటి వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తుందో చూడాలి.

కాగా, మంచు లక్ష్మీ చివరిసారిగా మాన్​స్టర్​ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆదిపర్వం సినిమాలో నటిస్తోంది. రీసెంట్​గా ఫస్ట్ లుక్ కూడా వచ్చింది. 1990 మధ్యకాలంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుందో.. అలాగే హిందీలో ఆమెకు ఎలాంటి అవకాశాలు వస్తాయో... మకాం మార్చిన మంచు లక్ష్మి.. ఇకపై అక్కడే

మంచు లక్ష్మీ హైదరాబాద్​ నుంచి ముంబకి మకాం మార్చిందా? హిందీ సినిమాలు, సిరీస్​ల్లో నటించేందుకు రెడీ అవుతుందా? అంటే అవుననే అనిపిస్తోంది. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. తాజాగా ఓ ట్వీట్​తో ఈ విషయాన్ని ధృవీకరించింది. ప్రస్తుతం ఈ ట్వీట్​ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

వివరాళ్లోకి వెళితే.. రీసెంట్​గా మంచు లక్ష్మీ మొన్న జరిగిన రకుల్ బర్త్ డే పార్టీలో సందడి చేసిన సంగతి తెలిసిందే. హీరోయిన్స్​​ ప్రగ్యా జైస్వాల్, రకుల్ ప్రీత్​తో కలిసి సరదాగా ఎంజాయ్ చేసింది. వారి బర్త్ డే పార్టీకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అయ్యాయి. ఇదే సమయంలో ఆమె ముంబయికి షిఫ్ట్ అయిందనే వార్తలు కూడా వచ్చాయి.

త్వరలోనే మంచు లక్ష్మి హిందీ సినిమా, సిరీస్​ల్లో నటించనుందని ప్రచారం సాగింది. అయితే తాజాగా ఈ విషయంపై మంచు లక్ష్మి స్పందించింది. "కొత్త నగరం, కొత్త యుగం. ఈ జీవితానికి చాలా కృతజ్ఞతలు. ఎప్పుడూ నన్ను ఆదరిస్తున్నందుకు, నన్ను విశ్వసిస్తున్నందుకు నా అభిమానులందరికీ ధన్యవాదాలు" అంటూ చెప్పుకొచ్చింది.

ఈ ట్వీచ్ చూసిన నెటిజన్లు.. బాలీవుడ్​ను ఏలడానికి వెళ్ళావా అక్కా అని కొందరు కామెంట్లు చేస్తుంటే.. మరి కొందరు మంచు పేరు నిలబెట్టాలి అంటూ అభిప్రాయపడుతున్నారు. నీకు హిందీ వచ్చా అక్కా? ఇప్పటి వరకు తెలుగు, ఇంగ్లీష్ కలిపిన యాసను విన్నాం.. ఇప్పుడు ఇంగ్లీష్ హిందీ మిక్స్ అయిన యాసను చూస్తామంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. మరి మంచు లక్ష్మీ అక్కడ ఎలాంటి వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తుందో చూడాలి..

కాగా, మంచు లక్ష్మీ చివరిసారిగా మాన్​స్టర్​ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆదిపర్వం సినిమాలో నటిస్తోంది. రీసెంట్​గా ఫస్ట్ లుక్ కూడా వచ్చింది. 1990 మధ్యకాలంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుందో.. అలాగే హిందీలో ఆమెకు ఎలాంటి అవకాశాలు వస్తాయో...