కన్నప్పను యంగ్ జెనరేషన్ చూస్తారా? విష్ణు ఆన్సర్ ఇదే!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 31 May 2025 10:44 AMటాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మహాభారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించారు. జూన్ 27వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మూవీ రిలీజ్ అవ్వనుంది.
పరమ శివుడి భక్తుడు కన్నప్ప పాత్రలో విష్ణు నటించారు. ప్రీతి ముకుందన్ ఫిమేల్ లీడ్ రోల్ పోషించారు. సాధువు రుద్ర పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. మహాశివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిదేవిగా కాజల్ అగర్వాల్ నటించారు. ప్రభాస్. కిరాటా రోల్ ను మోహన్లాల్ చేశారు. మోహన్ బాబు నిర్మిస్తూనే కీలక పాత్ర పోషించారు.
వారందరితోపాటు శరత్ కుమార్, మధూ, ముఖేష్ రుషి, బ్రహ్మాజీ, బ్రహ్మానందం, రఘుబాబు కీలకపాత్రల్లో సందడి చేయనున్నారు. మంచు విష్ణు కుమార్తెలు ఆరియానా, వివియానా తెరంగేట్రం చేస్తున్నారు. అయితే ఇప్పటికే కన్నప్పపై మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటిని మేకర్స్.. తమదైన విధంగా వాటిని పెంచుతున్నారు.
కొద్ది రోజుల నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. అదే సమయంలో ఓవర్సీస్ ప్రమోషన్స్ ను ఇప్పటికే కంప్లీట్ అవ్వగా.. ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ట్ చేశారు. మంచు విష్ణు ఇంటర్వ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆ సమయంలో.. జనరల్ జెడ్ కన్నప్ప చూడటానికి ఆసక్తి చూపుతారా అని హోస్ట్ అడగ్గా.. హీరో విష్ణు రెస్పాండ్ అయ్యారు.
ఆడియన్స్ చాలా తెలివైన వారని తెలిపారు. "ఒక సినిమా ప్రామిసింగ్ గా ఉందని భావిస్తే, వెళ్లి దాన్ని చూస్తారు. దానికి వయసుతో సంబంధం లేదు. దీనికి మంచి ఉదాహరణ చావా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ స్టోరీతో వచ్చిన సినిమాకు చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో హౌస్ ఫుల్స్ ఎలా అయ్యాయి?" అని అన్నారు.
"అద్భుతమైన కథ చెప్పడం, గొప్ప తారాగణం ఎంపిక, మంచి దర్శకత్వం కారణంగా ప్రజలు చావా సినిమాను ఆదరించారు. ప్రజలు మన చరిత్ర తెలుసుకోవాలనుకోవడం వల్ల అది జరిగింది. చావా, కన్నప్ప వంటి సినిమాలు చరిత్రను చెబుతాయి. అందుకే మూవీ ప్రామిసింగ్ గా ఉంటే ఏ జెనరేషన్ వాళ్లైనా చూస్తారు" అని విష్ణు స్పష్టం చేశారు.