తారక్ చేయి కాల్చిన మంచు మనోజ్..!
మంచు మనోజ్ దాదాపు 9 ఏళ్ల తర్వాత సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది. భైరవం సినిమాలో ముఖ్య పాత్రలో నటించడం ద్వారా మంచు మనోజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
By: Tupaki Desk | 9 Jun 2025 5:30 PMమంచు మనోజ్ దాదాపు 9 ఏళ్ల తర్వాత సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది. భైరవం సినిమాలో ముఖ్య పాత్రలో నటించడం ద్వారా మంచు మనోజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాలో మంచు మనోజ్ నటనకు మిశ్రమ స్పందన దక్కింది. భైరవం సినిమా తర్వాత మనోజ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించేందుకు మంచు మనోజ్ ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. భైరవం సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆయన మాట్లాడుతూ తన మనసులో మాటను చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చాడు.
ఇటీవల మంచు మనోజ్ ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్తో ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎన్టీఆర్ నాకు ఇండస్ట్రీలో సహ నటుడిగా మాత్రమే పరిచయం కాదు. అతడు నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు. ఇద్దరం కలిసి తిరిగేవాళ్లం, కలిసి ఆడుకున్న రోజులు ఉన్నాయని మంచు మనోజ్ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నాడు. ఒక ఫంక్షన్కు తారక్ ఫ్యామిలీతో పాటు మా ఫ్యామిలీ హాజరు అయ్యాం. ఆ సమయంలో ఫంక్షన్లో ఒక బెలూన్తో ఆడుకుంటున్న సమయంలో నేను చేసిన పని కారణంగా తారక్ చేయి కాలిందని మనోజ్ చెప్పుకొచ్చాడు. ఆ సంఘటన ఎప్పటికీ మరచిపోలేను అంటూ మంచు మనోజ్ పేర్కొన్నాడు.
బెలూన్కి మంట అంటించి ఎగుర వేసిన సమయంలో అది వెళ్లి తారక్ చేతిపై పడింది. దాంతో తారక్ చేయి బాగా కాలింది. అతడు బోరున ఏడ్వడంతో మా అమ్మమ్మ నన్ను వెంబడించి మరీ కొట్టింది. నా పనికి అమ్మమ్మ బాగా కొట్టిందని నవ్వుతూ మనోజ్ చెప్పుకొచ్చాడు. పిల్లాడిని చంపేస్తావా ఏంటి అంటూ అమ్మమ్మ ఆ సమయంలో తారక్ కు అయిన గాయం గురించి నన్ను పరిగెత్తించి మరీ కొట్టిందని మనోజ్ అప్పటి విషయాలను గుర్తుకు తెచ్చుకున్నాడు. తారక్తో ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా స్నేహం కొనసాగింది. ఇద్దరం కలిసి ఎన్నో పార్టీలకు వెళ్లడంతో పాటు ఇద్దరం రెగ్యులర్గా కలిసి తిరిగేవాళ్లం అని మనోజ్ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నాడు.
మంచు మనోజ్, ఎన్టీఆర్లు ఒకే రోజు పుట్టిన రోజు జరుపుకుంటారు. ఇద్దరి బర్త్డే ఒక్కటే కావడంతో ఇద్దరి మధ్య బాండింగ్ మరింతగా పెరిగింది అంటారు. మంచు మనోజ్ వ్యక్తిగత కారణాల వల్ల తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్న సమయంలో తారక్ బాసటగా నిలిచాడు అంటారు. ఆ విషయం గురించి పక్కన పెడితే ప్రస్తుతానికి మంచు మనోజ్ రీ ఎంట్రీపై గట్టిగా ఫోకస్ చేశాడు, వరుస సినిమాలు చేయడం ద్వారా ఇండస్ట్రీలో తిరిగి తన సత్తా చాటాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమాను చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందుతోంది. మరో వైపు వార్ 2 తో ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎన్టీఆర్ హీరోగా, మంచు మనోజ్ విలన్గా ఒక సినిమా వస్తే బాగుంటుంది అని చాలా మంది భావిస్తున్నారు. ఆ విషయమై మంచు మనోజ్ ఏమంటాడో చూడాలి.