Begin typing your search above and press return to search.

చావుకు లొంగిపోతున్నా... హీరోయిన్‌ సీరియస్‌!

తన ఆరోగ్యం గురించి సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలను షేర్ చేసిన వ్యక్తి కి మమతా మోహన్‌ దాస్‌ సీరియస్ గా వార్నింగ్‌ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   10 Nov 2023 5:32 AM GMT
చావుకు లొంగిపోతున్నా... హీరోయిన్‌ సీరియస్‌!
X

యమ దొంగ సినిమా తో తెలుగు లో మంచి గుర్తింపు దక్కించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ మమతా మోహన్ దాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీద ఉంది. ఈమె ఆ మధ్య క్యాన్సర్‌ తో బాధపడటం వల్ల సినిమాలకు దూరం అయింది. క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్న ఈమె తిరిగి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా ఆఫర్లు దక్కించుకుంటోంది.

మహమ్మారి అయిన క్యాన్సర్ నుంచి బయట పడ్డ మమతా మోహన్ దాస్‌ పూర్తి ఆరోగ్యంతో చక్కగా సినిమాలు చేసుకుంటూ ఉంటే కొందరు సోషల్ మీడియాలో ఆమె గురించి తప్పుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. తన ఆరోగ్యం గురించి సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలను షేర్ చేసిన వ్యక్తి కి మమతా మోహన్‌ దాస్‌ సీరియస్ గా వార్నింగ్‌ ఇచ్చింది.

గీతం నాయర్ అనే పేరుతో ఉన్న అకౌంట్‌ లో మమతా మోహన్‌ దాస్ అత్యంత దుర్భరమైన జీవితంను గడుపుతున్నారు. ఆమె చావుకు లొంగి పోతున్నట్లుగా చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఆమె ఇక బతకలేను అని కూడా అంటున్నారు అంటూ అందులో పేర్కొనడం చాలా మందికి విష్మయం కలిగించింది.

ఆ పోస్ట్‌ పై మమతా మోహన్ దాస్‌ తీవ్రంగా స్పందించింది. ప్రచారం కోసం, పబ్లిసిటీ కోసం ఇలాంటి పోస్ట్‌ లు పెట్టడం సబబు కాదు. అసలు నీవు ఎవరు..? నీవు దేని గురించి మాట్లాడుతున్నావు..? అంటూ సదరు పోస్ట్‌ కి మమతా మోహన్‌ దాస్ ఘాటు గా కామెంట్‌ చేసింది. ఈ విషయం లో మమతా మోహన్ దాస్‌ కి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.

హీరోయిన్ గానే కాకుండా గాయినిగా కూడా ప్రతిభ కనబర్చి మల్టీ ట్యాలెంటెడ్‌ అనిపించుకున్న మమతా మోహన్‌ దాస్ గురించి ఇలాంటి ప్రచారం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు అంటూ నెటిజన్స్ ఆమెకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని అంతా కోరుకుంటున్నారు.