Begin typing your search above and press return to search.

మమ్ముట్టి పాన్ ఇండియా హారర్​.. వ్వాటే స్పీడ్

వివరాల్లోకి వెళితే.. మమ్ముట్టి నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ భ్రమయుగం. హారర్​ థ్రిల్లర్ జానర్​లో అలరించేందుకు రాబోతుంది.

By:  Tupaki Desk   |   20 Oct 2023 8:38 AM GMT
మమ్ముట్టి పాన్ ఇండియా హారర్​.. వ్వాటే స్పీడ్
X

మలయాళ సూపర్‌ స్టార్ మమ్ముట్టికి తెలుగు చిత్ర పరిశ్రమతో మంచి అనుబంధం ఉందన్న సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా తనకంటూ అభిమానులను సొంతం చేసుకొన్నారు. మలయాళంలో బిజీ కావడం వల్ల తెలుగులో అడపా దడపా మంచి పాత్రలు మాత్రమే చేస్తున్నారు. అయితే తాజాగా ఆయన నుంచి రాబోతున్న పాన్ ఇండియా మూవీ భ్రమయుగం షూటింగ్ పూర్తి చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. మమ్ముట్టి నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ భ్రమయుగం. హారర్​ థ్రిల్లర్ జానర్​లో అలరించేందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని రాహుల్‌ శశీంద్రన్‌ డైరెక్ట్ చేస్తున్నారు. నైట్ షిపట్​ స్డూడియోస్​, వై నాట్ స్టూడియో బ్యానర్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చక్కవర్తి రామచంద్ర, ఎస్​ శశికాంత్​ ప్రొడ్యూస్ చేస్తున్నారు. భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు.

సిద్ధార్థ్​ భరతన్​, అర్జున్ అశోకన్​, అమల్దా లిజ్ సహా తదితరులు​ ఇతర కీలక పాత్రల్లో నటించారు. షెహ్నాద్​ జలాల్​ సినిమాటోగ్రాఫర్​గా ఉన్నారు. జోతిశ్ శంకర్​ ప్రొడక్షన్ డిజైనర్​గా, షాఫిక్ మహ్మద్​ అలీ ఎడిటర్​గా, టీడీ రామకృష్ణన్​ డైలాగ్స్​ను అందించారు. క్రిస్టో మ్యూజిక్​ సమకూర్చారు. చిత్రాన్ని వరల్డ్ వైడ్​గా మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 2024లో రిలీజ్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా షూటింగ్​ను పూర్తి చేసుకుంది. ఒట్టపాలెం, కొచి, అథిరపల్లి తదితర ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించారు. ఆగస్ట్ 17న షూటింగ్ ప్రారంభించగా.. కేవలం రెండు నెలల వ్యవధిలోనే షూటింగ్​ను పూర్తి చేసేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ మూవీటీమ్​ ఓ నైట్​ మోడ్​లో దిగిన ఓ ఫొటోను కూడా పోస్ట్ చేసింది. పాతబడ్డ చీకటి భవనంలో ఈ పిక్​ను దిగారు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులను జోరుగా చేసుకుంటుందని చిత్రబృందం తెలిపింది. త్వరలోనే ప్రమోషన్స్​ను ప్రారంభించనుంది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు కూడా సినిమాపై మంచి ఇంట్రెస్ట్​ను క్రియేట్ చేశాయి. చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత వరకు థ్రిల్​ను పంచి భయపెడుతుందో...