Begin typing your search above and press return to search.

మమిత బైజు… వారిలా అవ్వదు కదా..

మమిత బైజు వారిలా కాకుండా సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ తరహాలో సెలక్టివ్ గా మంచి పాత్రలు ఎంచుకొని సినిమాలు చేయాలి.

By:  Tupaki Desk   |   22 April 2024 3:55 AM GMT
మమిత బైజు… వారిలా అవ్వదు కదా..
X

కొంతమంది అందాల భామలు ఒకే ఒక్క సినిమాతో స్టార్ గా మారిపోతారు. యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకొని హీరోయిన్ గా వరుస అవకాశాలు సొంతం చేసుకుంటారు. ఒక్కసారి ఆడియన్స్ కి ఏ హీరోయిన్ అయిన కనెక్ట్ అయ్యిందంటే ఆమె కెరియర్ కి ఓ ఐదేళ్ల పాటు ఎలాంటి ఢోకా ఉండదు. దర్శక, నిర్మాతలు కూడా ఆ హీరోయిన్ ని తమ సినిమాలలో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు.

ఇప్పుడు అలా టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ బ్యూటీగా మారిపోయిన అందాల భామ మమిత బైజు. మలయాళీ మూవీ ప్రేమలు సినిమాలో ఈ అమ్మడు పెర్ఫార్మెన్స్ కి అందరూ ఫిదా అయిపోయారు. ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్ అయ్యి రిలీజ్ కాగా ఇక్కడ కూడా అద్భుత ఆదరణ సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు మమిత బైజుకి విపరీతంగా కనెక్ట్ అయిపోయారు.

సోషల్ మీడియాలో ఆమె గురించి వెతకడం మొదలు పెట్టారు. మలయాళీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, సాయి పల్లవి లాంటి స్టార్ హీరోయిన్స్ టాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. అయితే వారికి రాని గుర్తింపు ఒక్క సినిమాతో మమిత బైజుకి వచ్చేసింది. దీంతో తెలుగు దర్శక, నిర్మాతలు మమిత బైజుని తమ సినిమాలలో హీరోయిన్ గా పెట్టుకోవాలని సంప్రదిస్తున్నారంట.

ఇప్పటికే పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ ల నుంచి కూడా మమిత బైజుకి ఆఫర్స్ వస్తున్నాయంట. త్వరలో ఈ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ ఖాయమనే మాట వినిపిస్తోంది. అయితే ఓవర్ నైట్ స్టార్స్ గా మారిన అందాల భామలు 2, 3 సినిమాలకి పరిమితం అయ్యి తరువాత కనుమరుగైపోయారు. వాళ్లకి వచ్చిన క్రేజ్ తో అవకాశాలు సొంతం చేసుకున్న కూడా కథల ఎంపికలో పొరపాట్లు చేయడం, ప్రొడక్షన్ వేల్యూ చూసుకొని ప్రాధాన్యత లేని కమర్షియల్ హీరోయిన్ రోల్స్ చేయడంతో ఆశించిన సక్సెస్ కాలేదు.

వీరిలో ప్రియా ప్రకాష్ వారియర్, హానీ రోజ్ లాంటి బ్యూటీస్ టాలీవుడ్ లో ఇలా అడుగుపెట్టి అలా వెళ్లిపోయారు. ముఖ్యంగా ప్రియా ప్రకాష్ అయితే ఒక కనుసైగ షాట్ తో నేషనల్ వైడ్ గా క్రేజ్ అందుకుంది. కానీ ఆ తరువాత ఆమెకు సరైన అవకాశాలు రాలేదు. ఇక హాని రోజే గ్లామర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసినా వర్కౌట్ కాలేదు. ఆమెకు బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమా చేసిన తరువాత ఒక్క ఆఫర్ కూడా రాలేదు.

మమిత బైజు వారిలా కాకుండా సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ తరహాలో సెలక్టివ్ గా మంచి పాత్రలు ఎంచుకొని సినిమాలు చేయాలి. అలా చేస్తేనే హీరోయిన్ గా తెలుగులో లాంగ్ లైఫ్ ఉండే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక అమ్మడు రెమ్యునరేషన్ కూడా పెంచేసినట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ బ్యూటీ ఎలాంటి విజయాలను సొంతం చేసుకుంటుందో చూడాలి.