Begin typing your search above and press return to search.

సినిమాని భూతద్దంలో చూడవద్దు

సుధీర్ బాబు హీరోగా మృణాళిని రవి, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా హర్ష వర్ధన్‌ దర్శకత్వంలో రూపొందిన 'మామా మశ్చీంద్ర' సినిమా అక్టోబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది

By:  Tupaki Desk   |   3 Oct 2023 6:04 AM GMT
సినిమాని భూతద్దంలో చూడవద్దు
X

సుధీర్ బాబు హీరోగా మృణాళిని రవి, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా హర్ష వర్ధన్‌ దర్శకత్వంలో రూపొందిన 'మామా మశ్చీంద్ర' సినిమా అక్టోబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్‌ లు చూసిన తర్వాత కొత్తగా ఉంటుందేమో అనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సుధీర్‌ బాబు విభిన్నమైన మేకోవర్‌ తో పాటు అన్ని విషయాలు కొత్తగా అనిపిస్తున్నాయి.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వైభవంగా జరిగింది. యంగ్ హీరోలు శర్వానంద్‌, విశ్వక్‌ సేన్‌, శ్రీవిష్ణు లు పాల్గొన్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో హీరో సుధీర్‌ బాబు చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలో లావుగా కనిపించే పాత్ర కోసం తాను వేసుకున్న మేకప్‌ విషయం లో కొందరు విమర్శలు చేస్తున్నారంటూ సుధీర్ బాబు వ్యాఖ్యలు చేశాడు.

దుర్గ పాత్రకు సంబంధించిన మేకోవర్‌ మరియు లుక్‌ పై కొన్ని మీమ్స్ ను చూశాను. ఏమాత్రం బాగా లేవు అంటూ వారు కామెంట్స్ చేయడం నేను చూశాను. వారందరికీ నేను ఒకే విషయం చెబుతున్నాను. ప్రతి విషయాన్ని భూతద్దంలో చూడవద్దు. సాధారణ ప్రేక్షకులు ఎప్పుడూ కూడా సినిమాను భూతద్దం తో చూడరు. కనుక మీమర్స్ కూడా అలా చూడవద్దు అన్నట్లుగా సుధీర్ బాబు విజ్ఞప్తి చేశాడు.

సుధీర్ బాబు ఇంకా మాట్లాడుతూ... ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందు నేను శర్వానంద్ స్నేహితులం. శర్వా సినిమాల్లో అడుగు పెట్టబోతున్నాను అంటూ చెప్పిన సమయంలో నాకు తోచిన విషయాలు చెప్పాను. కష్టపడి మంచి స్థాయికి వచ్చాడు. విశ్వక్‌ సేన్ బిందాస్ గా బతికేస్తాడు. ఆ పద్దతి నాకు ఇష్టం అన్నాడు. ఇక ఈ సినిమా ప్రతి ఒక్కరిని అలరించే విధంగా ఉంటుంది అంటూ సుధీర్ బాబు ధీమాగా చెప్పుకొచ్చాడు.