Begin typing your search above and press return to search.

నాలా మరెవ్వరూ మోసపోవద్దు

మ్యూజిక్ ఆల్బమ్ షూటింగ్ అంతా పూర్తి అయిన తర్వాత తనకు రావాల్సిన పారితోషికం గురించి ఎన్ని సార్లు సంప్రదించినా కూడా ఏ ఒక్కరు స్పందించలేదు.

By:  Tupaki Desk   |   6 Feb 2024 3:44 AM GMT
నాలా మరెవ్వరూ మోసపోవద్దు
X

సినిమా ఇండస్ట్రీలో కొత్తగా అడుగు పెట్టిన వారికి ఆఫర్లు రావడమే గగనం. ఏదో మాదిరిగా ఆఫర్లు దక్కించుకున్నా కూడా పారితోషికం విషయంలో వారికి అత్యంత అన్యాయం జరుగుతూ ఉంటుంది. చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు మొదలుకుని కొత్త హీరోయిన్స్ వరకు చాలా మంది పారితోషికం పూర్తిగా అందలేదు అంటూ ఫిర్యాదు చేసిన వారు ఉన్నారు.


చిన్న నిర్మాణ సంస్థలు మాత్రమే కాకుండా పెద్ద నిర్మాతలు, బడా నిర్మాణ సంస్థలు కూడా చిన్న నటీనటులకు పారితోషికం ఎగవేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. మళ్లీ ఆ బ్యానర్‌ లో నటించే అవకాశం రావాలనే ఉద్దేశ్యంతో చాలా మంది నటీ నటులు పారితోషికం విషయంలో అన్యాయం చేసినా కూడా మౌనంగా ఉంటారు.

తాజాగా ఉత్తరాది ముద్దుగుమ్మ మాల్వీ మల్హోత్రా ఈ విషయమై స్పందించింది. ప్రముఖ బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ విక్రమ్‌ భట్ నిర్మాణంలో మాల్వీ ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేసిందట. సౌత్‌ లో వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో విక్రమ్‌ భట్ ఆఫీస్‌ నుంచి ఆఫర్ వచ్చిందట. డేట్లు లేకున్నా కూడా సర్దుబాటు చేసి మరీ విక్రమ్‌ భట్ నిర్మాణంలో మ్యూజిక్ ఆల్బం చేసిందట.

మ్యూజిక్ ఆల్బమ్ షూటింగ్ అంతా పూర్తి అయిన తర్వాత తనకు రావాల్సిన పారితోషికం గురించి ఎన్ని సార్లు సంప్రదించినా కూడా ఏ ఒక్కరు స్పందించలేదు. విక్రమ్‌ భట్ తో ఫోన్ లో మాట్లాడేందుకు ప్రయత్నించినా కూడా సఫలం అవ్వలేదు. ఆయన నా ఫోన్ కి ఆన్సర్‌ ఇవ్వలేదు.

కొన్నాళ్ల తర్వాత మరో ప్రాజెక్ట్‌ కోసం విక్రమ్‌ భట్ ఆఫీస్‌ నుంచి ఆఫర్ వచ్చింది. కానీ తాను అలాంటి నమ్మక ద్రోహం చేసిన వారితో మళ్లీ వర్క్‌ చేయాలి అనుకోలేదు అంది. అందుకే ఆ ఆఫర్‌ ను తిరష్కరించాను అంది. మరెవ్వరు కూడా వారి వల్ల నా మాదిరిగా మోసపోవద్దు అనే ఉద్దేశ్యంతో ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పేందుకు వచ్చాను అన్నట్లుగా మాల్వీ పేర్కొంది. ఈ విషయమై విక్రమ్‌ భట్ ఆఫీస్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. ఈ విషయమై పలువురు మాల్వీ కి మద్దతుగా నిలుస్తున్నారు.