Begin typing your search above and press return to search.

మ‌ల్లిడి వ‌శిష్ణని అల్లు శిరీష్ హ‌ర్ట్ చేశాడా?

ఇదే ప‌రిస్థితిని యంగ్ డైరెక్ట‌ర్ మ‌ల్లిడి వ‌శిష్ట ఎదుర్కొన్నార‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌న తండ్రి, నిర్మాత‌ మ‌ల్లిడి స‌త్య‌నారాయ‌ణ ఇటీవ‌ల ఓ మీడియాలో ముచ్చ‌టిస్తూ వెల్ల‌డించారు.

By:  Tupaki Desk   |   14 April 2025 4:30 PM
మ‌ల్లిడి వ‌శిష్ణని అల్లు శిరీష్ హ‌ర్ట్ చేశాడా?
X

సినిమా ఇండ‌స్ట్రీలో ఎవ‌రి మైండ్ సెట్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. అదే విధంగా ఎప్పుడు ఎవ‌రిని ఎవ‌రు, ఎలా రిజెక్ట్ చేసి అవ‌మానిస్తారో కూడా చెప్ప‌డం క‌ష్టం. చేస్తున్న సినిమా హిట్ అయితే ముందు అనుకున్న ప్రాజెక్ట్‌లు అర్థాంత‌రంగా ఆగిపోవ‌డం, ఆ ప్రాజెక్ట్‌ల‌ని ఎలాంటి మొహ‌మాటం లేకుండా రిజెక్ట్ చేయ‌డం జ‌రుగుతూ ఉంటుంది. అయితే బాగా తెలిసిన వాళ్లతో, అందులో క్లోజ్ ఫ్రెండ్ డైరెక్ష‌న్‌లో సినిమా ప్ర‌క‌టించి, ఓపెనింగ్ జ‌రిగాక కూడా దాన్ని కావాల‌ని ఆపేస్తే ఎవ‌రి ఈగో అయినా హ‌ర్ట్ కావ‌డం స‌హ‌జం.

ఇదే ప‌రిస్థితిని యంగ్ డైరెక్ట‌ర్ మ‌ల్లిడి వ‌శిష్ట ఎదుర్కొన్నార‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌న తండ్రి, నిర్మాత‌ మ‌ల్లిడి స‌త్య‌నారాయ‌ణ ఇటీవ‌ల ఓ మీడియాలో ముచ్చ‌టిస్తూ వెల్ల‌డించారు. క‌ల్యాణ్‌రామ్‌తో `బింబిసార‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని అందించి తొలి ప్ర‌య‌త్నంలోనే ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు మ‌ల్లిడి వ‌శిష్ట‌. ఈ మూవీ అందించిన స‌క్సెస్‌తో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవ‌కాశాన్ని ద‌క్కించుకున్నారు. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవితో మ‌ల్లిడి వ‌శిష్ట `విశ్వంభ‌ర‌`ను తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే మ‌ల్లిడి వ‌శిష్ట ద‌ర్శ‌కుడిగా అల్లు శిరీష్ హీరోగా క‌న్న‌డ నిర్మాత శైలేంద్ర‌బాబు నిర్మాణంలో ఓ సినిమా రావాల్సింది. ఇది ద‌ర్శ‌కుడిగా మ‌ల్లిడి వ‌శిష్ట‌కు తొలి సినిమా. సోషియో ఫాంట‌సీ డ్రామాగా తెర‌పైకి రావాల్సిన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్య‌క్ర‌మ‌యాలు కొన్నేళ్ల క్రితం అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో అట్ట‌హాసంగా జ‌రిగాయి. మ‌రో నెలరోజుల్లో రెగ్యుల‌ర్ షూటింగ్‌ని ప్రారంభించాల‌ని షెడ్యూల్ కూడా ఫైన‌ల్ చేశారు.

అయితే అదే టైమ్‌లో ప‌ర‌శురామ్ ద‌ర్శ‌కుడిగా గీతా ఆర్ట్స్‌పై నిర్మించిన `శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు` రిలీజ్ అయింది. హిట్ టాక్‌ని సొంతం చేసుకుంద‌ట‌. దీంతో త‌న త‌న‌యుడు మ‌ల్లిడి వ‌శిష్ట ప్రాజెక్ట్‌పై శిరీష్ మ‌న‌సు మార్చుకున్నాడ‌ని, ఈ టైమ్‌లో ఈ ప్రాజెక్ట్ చేయ‌లేని చెప్పేసి షాక్ ఇచ్చాడ‌ని మ‌ల్లిడి స‌త్య‌నారాయ‌ణ సంచ‌ల‌న విష‌యాల‌న్ని తాజా ఇంట‌ర్వ్యూలో బ‌య‌ట‌పెట్టారు. క్లోజ్ ఫ్రెండ్ సినిమాని ఆపేసిన అల్లు శిరీష్ ఆ క్రేజ్‌తో వి.ఐ. ఆనంద్ సినిమాకు వెళ్లిపోయి మ‌ల్లిడి వ‌శిష్ట‌ని అవ‌మానించాడ‌ని, అల్లు అర‌వింద్ ఇలా చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని వాదించినా శిరీష్ ప‌ట్టించుకోలేద‌ని, అయితే మ‌రో క‌థ‌తో వ‌స్తే ఆ సినిమాని తాను నిర్మిస్తాన‌ని అల్లు అర‌వింద్ మాటిచ్చార‌ని, కానీ స్నేహితుడు శిరీష్ త‌నతో ప్రాజెక్ట్‌ని ప్రారంభంలోనే నిలిపివేయ‌డంతో నా త‌న‌యుడు వ‌శిష్ట హ‌ర్ట్ అయ్యాడ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది