Begin typing your search above and press return to search.

ఇండియన్ 2 తో మళ్ళీ కన్ఫ్యూజన్?

వచ్చే సంక్రాంతికి ఇండియన్ 2 రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. దీన్ని వచ్చే ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పంద్రాగస్ట్ న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.

By:  Tupaki Desk   |   9 Sep 2023 2:30 AM GMT
ఇండియన్ 2 తో మళ్ళీ కన్ఫ్యూజన్?
X

తన ఆలోచనలకు టెక్నాలజీ జోడించి, ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతుంటారు కోలీవుడ్‌ దర్శకుడు శంకర్‌. అత్యున్నత సాంకేతికతకు పెద్దపీట వేస్తూనే సోషల్ మెసేజ్ సినిమాలను అద్భుతంగా తెరకెక్కిస్తారు. ఇప్పుడు ఆయన నుంచి రెండు భారీ సినిమాలు రాబోతున్నాయి. కమల్ హాసన్ తో ఇండియన్‌ 2, రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ చేస్తున్నారు. ఇండియన్ 2ను వచ్చే ఏడాది సంక్రాంతికి, గేమ్ ఛేంజర్ ను వచ్చే వేసవికి విడుదల చేస్తానని అన్నారు. కానీ ఇప్పుడది కుదిరేలా కనిపించడం లేదు.

వివరాళ్లోకి వెళితే.. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్.. రెండు చిత్రాలు ఒకేసారి బ్యాలెన్స్ చేస్తూ షూటింగ్ చేస్తున్నారు శంకర్. అయితే వీటిలో ఇండియన్ 2 చిత్రాన్ని మొదట రెండు భాగాలుగా తీసుకొస్తున్నారని ప్రచారం సాగింది. కానీ ఆ తర్వాత ఒక్క భాగంగానే వస్తుందని, అది సంక్రాంతికి ఆడియెన్స్ ముందుకు వస్తుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇది వచ్చాకే చరణ్ గేమ్ ఛేంజర్ సమ్మర్ కు రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం అందింది. కానీ ఇప్పుడీ రిలీజ్ డేట్ షెడ్యూల్స్ మారినట్లు తెలుస్తోంది.

వచ్చే సంక్రాంతికి ఇండియన్ 2 రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. దీన్ని వచ్చే ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పంద్రాగస్ట్ న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అంటే దీని బట్టి గేమ్ ఛేంజర్ మరింత ముందుకు జరిగినట్లు అర్థమవుతోంది. దీంతో ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామ్ చరణ్ ఫ్యాన్స్ కు నిరాశ ఎదురైనట్టు అయింది. చూడాలి మరి రెండు చిత్రాలు కాస్త గ్యాప్ ఇచ్చి ఒకేసారి రిలీజ్ చేస్తారా లేదా గేమ్ ఛేంజర్ ను మరింత ఆలస్యం చేస్తారా అనేది.

ఇండియ్ 2 సినిమా విషయానికొస్తే.. 1996లో సంచలన విజయం సాధించిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా రాబోతుంది. ఇందులో కాజల్‌ అగర్వాల్‌, సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ప్రియా భవానీ శంకర్‌, బాబీ సింహా, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అవెంజర్స్‌, కెప్టెన్‌ మార్వెల్‌, బ్లాక్‌ పాంథర్‌, అవతార్‌ సహా హాలీవుడ్‌ హిట్‌ చిత్రాలకు విజువల్స్‌ అందించిన ప్రముఖ సంస్థ లోలా ఈ చిత్రానికి వీఎఫ్ ఎక్స్ అందించనుండటం విశేషం.

ఇక గేమ్‌ ఛేంజర్‌ .. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. రామ్‌ చరణ్‌ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాలో కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తోంది. ఎస్ జే సూర్య, సునీల్, అంజలి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు దీన్ని నిర్మిస్తున్నారు.