Begin typing your search above and press return to search.

200 మందికి... మహేష్‌ ఓపికకి హ్యాట్సాఫ్‌

షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత డాన్సర్స్ అందరికి కూడా మహేష్ బాబు ఫోటోలు ఇచ్చాడు. దాదాపు 200 మందికి ఓపికగా నిల్చుని మహేష్‌ బాబు ఫోటోలు ఇచ్చారు.

By:  Tupaki Desk   |   27 Nov 2023 10:34 AM GMT
200 మందికి... మహేష్‌ ఓపికకి హ్యాట్సాఫ్‌
X

సోషల్‌ మీడియా సెలబ్రిటీలే కాస్త ఫేమ్ రాగానే సెల్ఫీలు తీసుకుందానికి వచ్చిన వారిపై చిరాకు పడుతూ ఉంటారు. పది ఇరవై మందికి సెల్ఫీలు ఇవ్వగానే బాబోయ్ ఎందుకు వచ్చిందిరా ఈ పాపులారిటీ అంటూ వ్యాఖ్యలు చేసే వారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే మహేష్ బాబు తీరు వేరు. ఆయన మరోసారి సూపర్‌ స్టార్‌ అనిపించుకున్నారు.

సూపర్ స్టార్‌ మహేష్ బాబు తన మంచితనం గురించి ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయన యొక్క గొప్ప మనసును చెప్పకనే చెబుతున్నారు. తాజాగా గుంటూరు కారం సినిమా కోసం ఒక మాస్‌ సాంగ్ చిత్రీకరించారు. ఆ సాంగ్ చిత్రీకరణ కోసం వందలాది మంది డాన్సర్స్ షూట్‌ లో పాల్గొన్నారు.

షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత డాన్సర్స్ అందరికి కూడా మహేష్ బాబు ఫోటోలు ఇచ్చాడు. దాదాపు 200 మందికి ఓపికగా నిల్చుని మహేష్‌ బాబు ఫోటోలు ఇచ్చారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అవుతోంది. షూటింగ్‌ చేసి అలసి పోయిన మహేష్ బాబు ఫ్యాన్స్ ను నిరుత్సాహ పర్చకుండా ఫోటోలకు ఫోజ్ లు ఇచ్చేందుకు చాలా సమయం నిల్చుని ఉండటం గొప్ప విషయం అని, నీ ఓపికకి హ్యాట్సాఫ్ అంటూ ఫ్యాన్స్ సోషల్‌ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు మహేష్ బాబు రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా కనిపించబోతుంది. మరో హీరోయిన్‌ గా మీనాక్షి చౌదరి కనిపించబోతుంది. గుంటూరు కారం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుందని తెలుస్తోంది. జనవరి మొదటి వారంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో మహేష్ బాబు పాల్గొంటాడని యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.