Begin typing your search above and press return to search.

మహేష్ మళ్లీ... గుంటూరు కారంకు బ్రేక్‌!

మహేష్‌ బాబు ఈనెల 19వ తారీకున ఫ్యామిలీ తో కలిసి లండన్ వెళ్లబోతున్నాడు.

By:  Tupaki Desk   |   17 July 2023 7:22 AM GMT
మహేష్ మళ్లీ... గుంటూరు కారంకు బ్రేక్‌!
X

సూపర్ స్టార్‌ మహేష్ బాబు తన ఫ్యామిలీ తో రెగ్యులర్ గా విదేశీ ట్రిప్స్ కు వెళ్లడం మనం చూస్తూనే ఉంటాం. ఆ మధ్య గుంటూరు కారం సినిమా షూటింగ్ ను వాయిదా వేసి మరీ విదేశాల కు వెళ్లారు అంటూ వార్తలు వచ్చాయి. ఆ విషయం పక్కన పెడితే మరోసారి మహేష్ బాబు విదేశీ ప్రయాణానికి సిద్ధం అవుతున్నారంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం గుంటూరు కారం షూటింగ్ లో మహేష్ బాబు పాల్గొంటున్నాడు. నిన్న ఆదివారం కూడా బ్రేక్ తీసుకోకుండా మహేష్ షూటింగ్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం చేస్తున్న షెడ్యూల్ ఈ నెల 18వ తేదీ తో ముగియనుంది. తదుపరి షెడ్యూల్‌ కు చిన్న బ్రేక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

మహేష్‌ బాబు ఈనెల 19వ తారీకున ఫ్యామిలీ తో కలిసి లండన్ వెళ్లబోతున్నాడు. మహేష్ తనయుడు గౌతమ్‌ లండన్ లో ఉన్నత చదువులు చదువుతున్న విషయం తెల్సిందే. అందుకే అక్కడ కు ప్రత్యేక కార్యక్రమం లో పాల్గొనేందుకు గాను వారం రోజుల పాటు లండన్ వెళ్లేందుకు ఫ్యామిలీ మొత్తం రెడీ అవుతున్నారట.

లండన్ నుండి తిరిగి వచ్చిన వెంటనే గుంటూరు కారం సినిమా షూటింగ్‌ లో పాల్గొంటాడని తెలుస్తోంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.

గుంటూరు కారం సినిమా లో శ్రీలీల.. మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా తో మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్‌ ను అందుకుంటాడనే నమ్మకంతో అభిమానులు.. ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబో లో వచ్చిన గత చిత్రాలు కమర్షియల్ గా నిరాశ పరిచిన నేపథ్యంలో గుంటూరు కారం సినిమా విషయం లో అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.